close
Choose your channels

కరోనాతో కోలీవుడ్ నటుడు నితీశ్ వీరా మృతి

Monday, May 17, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా మహమ్మారి కారణంగా ఎంతమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారో తెలియనిది కాదు. సెకండ్ వేవ్‌లో పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్‌లో లక్షల్లో ప్రజలు కరోనా బారిన పడుతుండగా.. వేలల్లో కరోనాతో మరణిస్తున్నారు. భారత్‌లో ఎక్కడ చూసినా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. శ్మశానాల్లో సైతం హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. సెకండ్ వేవ్ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.

Also Read: ఈ లక్షణాలున్నాయా? అయితే కరోనాగా అనుమానించాల్సిందే..

ఇటీవల ప్రముఖ నటుడు జగపతి బాబు అన్నట్టు కరోనా మహమ్మారి కారణంగా ఎవరెప్పుడు పోతారో తెలియకుండా పోతోంది. సినీ రంగానికి సంబంధించిన కొంద‌రు సెల‌బ్రిటీలు ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా కన్నుమూశారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు వారి కుటుంబ స‌భ్యుల్ని, స‌న్నిహితుల‌ను కోల్పోయారు. క‌రోనా కార‌ణంగా, కోలీవుడ్ చిత్ర సీమ‌కు చెందిన అప్ క‌మింగ్ యాక్ట‌ర్ నితీశ్ వీరా(45) నేడు (సోమవారం) కన్నుమూశారు. పేర‌రుసు, వెన్నిల క‌బ‌డి కుళు, పుదు పేట్టై, అసుర‌న్ చిత్రాల్లో నితీశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నితీశ్ వీరా మృతిపై కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.