కోలీవుడ్ X టాలీవుడ్.. సిద్దార్థ్ కామెంట్స్ వైరల్!

  • IndiaGlitz, [Thursday,July 22 2021]

సోషల్ మీడియాలో కోలీవుడ్ అభిమానులు, టాలీవుడ్ అభిమానుల మధ్య ఫైట్ తారాస్థాయికి చేరుతోంది. నారప్ప చిత్రం అమెజాన్ లో విడుదలైనప్పటి నుంచి ఈ వార్ మొదలైంది. కొందరు కోలీవుడ్ అభిమానులు ఒరిజినల్ వర్షన్ అసురన్ తో పోల్చుకుంటే నారప్ప ఏమాత్రం బాగాలేదని ట్రోల్ చేస్తున్నారు. దీనికి టాలీవుడ్ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు.

ఈ వివాదం సోషల్ మీడియాలో కోలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ గా మారింది. దీనిపై హీరో సిద్దార్థ్ ట్విట్టర్ లో సెటైరికల్ గా స్పందించాడు. 'కొందరు మేధావుల మధ్య టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్ ఫైట్ జరుగుతోంది. ఇది చూశాక నాకు చిన్న ఆలోచన వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఇటీవల వింధ్య పర్వతాలకు దిగువన ఉన్న అన్ని భాషల్ని కలిపేస్తూ నెట్ ఫ్లిక్స్ సౌత్ అనే కేటగిరి తీసుకువచ్చింది. ముందు అది మార్చండి. ప్రతి భాషకు ప్రాధాన్యత ఇచ్చేలా అన్ని భాషలకు కేటగిరీలు ఉండాలి. సినిమాల్లో హిందీ పరిశ్రమ పెద్దది అనే భావన మారాలి.దానిని మార్చండి' అని సిద్దార్థ్ ట్వీట్ చేశాడు.

ప్రతి ఒక్కరూ హిందీ పరిశ్రమే పెద్దది అనే భావనతో ఉన్నారని.. ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత దక్కడం లేదనేది సిద్దార్థ్ అభిప్రాయం. ముందు దాని గురించి ఆలోచించకుండా టాలీవుడ్, కోలీవుడ్ అంటూ కొట్టుకోవడం ఏంటని సిద్దార్థ్ పరోక్షంగా అభిమానులకు చురకలంటించారు.

మరి కొందరు అభిమానులైతే టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ స్టార్ డం ఉన్న పవన్ కళ్యాణ్, విజయ్ లని పోల్చుతూ కామెంట్స్ చేసుకుంటున్నారు. నారప్పలో వెంకటేష్ కంటే అసురన్ లో ధనుష్ అద్భుతంగా నటించాడని కోలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. వెంకటేష్ నటన అద్భుతంగా ఉందనేది టాలీవుడ్ అభిమానుల వాదన. ఈ క్రమంలో కొందరు తెలుగు నుంచి తమిళ్ లోకి రీమేక్ అయినా చిత్రాలని ప్రస్తావిస్తున్నారు. మహేష్ బాబు పోకిరి చిత్రాన్ని తమిళ్ లో చెడగొట్టారు అని టాలీవుడ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

More News

ప్రియమణి వివాహం చెల్లదు.. ఆమె భర్త మొదటి భార్య షాకింగ్ కామెంట్స్!

క్రేజీ హీరోయిన్ ప్రియమణి, ముస్తఫా రాజ్ ల వివాహం వివాదంగా మారింది.

చావు బతుకుల్లో భర్త.. ఆయనతోనే పిల్లలు కనాలి అంటూ కోర్టుకి భార్య!

మహమ్మారి కరోనా ప్రజా జీవనాన్ని, కుటుంబాలని ఎలా నాశనం చేస్తోందో కళ్లారా చూస్తూనే ఉన్నాం.

అడ్డంకులు చీల్చుకుంటూ 'వకీల్ సాబ్' ప్రపంచ రికార్డ్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ సత్తా గురించి అందరికి తెలిసిందే. పవన్ సినిమా రిలీజ్ అంటే ఆరోజు అభిమానులకు పండగ వాతావరణం.

సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పిన ఫిల్మ్ ఛాంబర్!

చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లు కళకళలాడబోతున్నాయి. జూలై 30 నుంచి తెలంగాణాలో థియేటర్లు పునః ప్రారంభించేందుకు థియేటర్ యాజమాన్యాలు,

ముఖానికి ముసుగు, న్యూడ్ గా కనిపించమన్నాడు.. రాజ్ కుంద్రా రాసలీలలు

పోర్న్ ఫిలిమ్స్ మేకింగ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.