`రాక్ష‌సుడు` చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంది - నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'రాక్షసుడు'. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా మూడు వారాల ప్ర‌ద‌ర్శ‌న‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత కొనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ - ''రాక్ష‌సుడు సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. అలాగే పిల్లలు నుండి పెద్ద‌లు వ‌ర‌కు అంద‌రినీ సినిమా ఆక‌ట్టుకుంటుంది. ఆడ‌పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో త‌ల్లిదండ్రుల తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను సందేశాత్మ‌కంగా చూపించారు. సినిమా మూడు వారాల‌ను పూర్తి చేసుకుని నాలుగో వారంలోని సినిమా అడుగు పెట్టింది. మ‌రో రెండు వారాల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మా ఏ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ఇంత పెద్ద విజయాన్ని సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉంది'' అన్నారు.

ర‌మేశ్ వ‌ర్మ మాట్లాడుతూ - ''సినిమా క‌థ‌పై న‌మ్మ‌కంతో చేశాం. మా న‌మ్మ‌కం ఈరోజు నిజ‌మైంది. ఓరిజిన‌ల్ కంటెంట్‌లోని అంశాల‌ను మిస్ చేయ‌కుండా మ‌న‌కు త‌గ్గ‌ట్టు చేశాం. అనుప‌మ మంచి పాత్ర చేసింది. ముందు ఈ పాత్ర‌లో ఆమె న‌టించ‌డానికి అంగీక‌రించలేదు. చివ‌ర‌కు మంచి సినిమాలో అవ‌కాశం కోల్పోకు అని తండ్రి చెప్పిన మాట‌ల‌కు క‌ట్టుబ‌డి న‌టించింది'' అన్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ - కొన్నిరోజులు హెల్త్ బాలేదు. త‌ర్వాత త‌మిళంలో షూటింగ్‌లో పాల్గొన‌డం వ‌ల్ల స‌క్సెస్ మీట్‌కు హాజ‌రు కాలేక‌పోయాను. మంచి సినిమా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ కెరీర్‌కు ఎప్పుడూ సాయ‌ప‌డుతుంది. అలాంటి సినిమానే రాక్ష‌సుడు'. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్‌'' అన్నారు.

More News

‘మెగాస్టార్’ నేను కాదు.. ఆయన్ను ఎవరూ రీచ్ కాలేరు!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

'సైరా న‌ర‌సింహారెడ్డి' టీజ‌ర్ విడుద‌ల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

‘సాహో’కు చెర్రీకి సంబంధమేంటి!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది.

‘అమరావతి’ షిప్ట్ కానుందా.. అసలేం జరుగుతోంది!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాదా..? అమరావతి కాకుండా మరో చోటికి రాజధానిని మార్చేస్తారా..?

టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకున్న సాహో ‘బ్యాడ్ భామ’!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’.