ఆ ఇద్ద‌రు మిస్స‌యినా.. కొర‌టాల మిస్ కాలేదు

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

ఇటీవ‌ల కాలంలో తొలి చిత్రంతో విజ‌యం సాధించిన ప‌లువురు తెలుగు ద‌ర్శ‌కులు.. రెండో సినిమాకి వ‌చ్చేస‌రికి ద్వితీయ విఘ్నం  స‌మ‌స్య‌తో ప‌రాజ‌యం పాలైన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి.  అయితే.. మ‌హేష్‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులు మాత్రం అందుకు మిన‌హాయింపు. నువ్వే నువ్వేతో ద‌ర్శ‌కుడిగా మారిన ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ త‌న‌ రెండో చిత్రం అత‌డుతో విజ‌యం అందుకుంటే..

కొత్త బంగారు లోకంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన శ్రీ‌కాంత్ అడ్డాల‌ సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టుతో ద్వితీయ విఘ్నం అధిగ‌మించారు. ఇక మిర్చితో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన కొర‌టాల శివ‌ శ్రీ‌మంతుడుతో ఈ ప‌రిస్థితిని అధిగమించారు. ఈ ముగ్గురూ ద‌ర్శ‌కుల‌కి సంబంధించి మ‌రో విశేష‌మేమిటంటే.. త‌మ మూడో చిత్రాన్ని వేరే హీరోల‌తో చేసినా.. నాలుగో చిత్రం మాత్రం మ‌హేష్‌తోనే చేయ‌డం. అయితే.. ఈ విష‌యంలో త్రివిక్ర‌మ్ (ఖ‌లేజా), శ్రీ‌కాంత్ అడ్డాల (బ్రహ్మోత్సం) ప‌రాజ‌యాల పాల‌యితే.. కొర‌టాల శివ మాత్రం భ‌ర‌త్ అనే నేనుతో రెండో సారీ విజ‌యాన్ని అందుకుని వార్త‌ల్లో నిలిచారు.

More News

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు.

దేవిశ్రీ ఖాతాలో మ‌రొక‌రు..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో నంబ‌ర్ వ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా రాణిస్తున్నారు యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌.

బాల‌కృష్ణ‌తో మ‌ళ్ళీ అలాగే..

నటసింహా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో మ‌రో విజ‌యవంత‌మైన చిత్రంగా నిలిచింది..

సోనాలి త‌రువాత కియారానే..

తాజాగా విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రంగా నిలిచిపోయింది.

హైద‌రాబాద్‌లో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ ఫ్లాట్ పామ్ సెల‌బ్ క‌నెక్ట్‌

సోష‌ల్ మీడియాకు అద‌ర‌ణ అంత‌కు అంత పెరుగుతూనే ఉంది. ఇలాంటి త‌రుణంలో స‌రికొత్త ఐడియాల‌జీతో మ‌న హైద‌రాబాద్ న‌గరంలోకి సెల‌బ్ క‌నెక్ట్ అనే సోష‌ల్ క‌నెక్టింగ్ నెట్ వ‌ర్క్ స్టార్ట‌య్యింది.