చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును దూరం పెడతా: ప్రజలకు ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

  • IndiaGlitz, [Thursday,January 06 2022]

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు రావడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. సాయం చేయాలంటే తన భార్యను గదికి పంపాలని రాఘవ వేధింపులకు గురిచేశాడంటూ చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పడంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వనమా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కుమారుడిపై ఆరోపణలు రావడం కలిచివేసిందని, పోలీసులు ఎప్పుడు పిలిచినా తన కొడుకుని అప్పగిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాఘవ విషయంలో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నట్లు వనమా తెలిపారు. ఇకపై తన కుమారుడిని నియోజకవర్గానికి, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచుతానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని.... పార్టీలు, వ్యక్తుల ఆరోపణలు తాను పట్టించుకోను అని లేఖలో పేర్కొన్నారు.

ఆయన లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను కొత్తగూడెం పోలీసులు గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో దుమారం రేపింది. అందులో తన నిర్ణయానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఆ సందర్భంగా రాఘవేంద్రరావుపై రామకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు.

More News

ఐదు భాషల్లో  21న "వర్మ'' (వీడు తేడా) ఆగమనం

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం "వర్మ'' (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ ,సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు.

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య.. ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

‘‘ నా భార్యను పంపమన్నాడు’’.. రామకృష్ణ సెల్ఫీ వీడియో , వనమా రాఘవకు బిగుస్తోన్న ఉచ్చు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటన కీలక మలుపు తిరిగింది.

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ 'శేఖర్' ఫస్ట్ సింగిల్ "లవ్ గంటే మోగిందంట" విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. హీరోగా ఆయన 91వ చిత్రమిది.

నా నటన. అతిధి దేవోభవ లో అందరినీ మెప్పిస్తుంది.. ఆది

ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ' జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు.