బాలీవుడ్ క్వీన్ ను డైరెక్ట్ చేయనున్న క్రిష్...

  • IndiaGlitz, [Wednesday,March 22 2017]

గ‌మ్యం, వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గుర‌మ్‌, రీసెంట్‌గా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి వంటి విల‌క్ష‌ణ చిత్రాల డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ మ‌రో బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేయ‌నున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ చిత్రంలో న‌టిస్తూ నిర్మించ‌నుంది. బాహుబ‌లి, భ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రాల ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కన్స‌లెంట్‌గా ప‌నిచేస్తున్నాడు. కంగ‌నా ర‌నౌత్ కూడా స్క్రిప్ట్ వ‌ర్క్‌లో భాగం కానుంది.

మ‌రి ఈ చిత్రాన్ని ఎవ‌రు డైరెక్ట్ చేయాల‌ని కంగ‌నా ఆలోచిస్తుంటే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క్రిష్ పేరుని సూచించాడు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా చూసిన త‌ర్వాత కంగ‌నా కూడా క్రిష్ అయితే ఝాన్సీ ల‌క్ష్మీభాయ్‌ సినిమాను చ‌క్క‌గా హ్యాండిల్ చేయ‌గ‌ల‌డ‌ని భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార‌క స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ

మ్యూజికాలజిస్ట్ హాసంరాజా పాటల,వాటి రాగాలపై రాసిన 'ఆపాత మధురం' పుస్తకావిష్కరణ కార్యక్రమం ఇటీవల సికింద్రాబాద్ లో జరిగింది.

పాండిచ్చేరిలో 'రాజు గారి గది 2' మూడో షెడ్యూల్!

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న "రాజు గారి గది" సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే "రాజు గారి గది 2".

రాజకీయ నాయకుడిగా నందమూరి హీరో...

హీరో, నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్రామ్ ఇజమ్ తర్వాత హీరోగా ఏ సినిమా చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్లో తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్లో జై లవకుశ(వినపడుతున్న టైటిల్) సినిమా నిర్మాణానికి రంగం సిద్ధం చేశాడు.

మున్నాభాయ్ కు గాయాలు

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్దత్కు సినిమా షూటింగ్లో గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే..ప్రస్తుతం సంజయ్దత్ భూమి అనే సినిమాలో నటిస్తున్నాడు.

మలయాళంలోకి ధనుష్

తమిళ హీరో ధనుష్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. తమిళంలో హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ధనుష్ సినిమాలను చేస్తున్నాడు. వండర్ బార్స్ బ్యానర్పై తన టెస్ట్కు తగిన విధంగా ధనుష్ నిర్మాతగా రాణిస్తున్నాడు.