600కు పైగా ప్రీమియ‌ర్ షోల‌తో 'కృష్ణార్జున యుద్ధం'

  • IndiaGlitz, [Friday,April 06 2018]

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో రూపొందిన‌ చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలుగా నటించారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించగా..త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు  హిప్ హాప్ తమిళ సంగీత దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని.. ఓవర్సీస్‌లో నానికున్న మార్కెట్ దృష్ట్యా భారీగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింద‌ని స‌మాచారం. అందుకే ఒక్క‌రోజు ముందు అంటే..  ఈ నెల 11న 600కు పైగా ప్రీమియర్ షోలతో ఈ సినిమాని యు.ఎస్.లో ప్రదర్శించ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఒక‌రకంగా.. నాని కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓవ‌ర్సీస్ రిలీజ్‌గా చెప్పుకోవ‌చ్చు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న నాని.. ఈ సినిమాతోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తారేమో చూడాలి.

More News

ఎన్టీఆర్ అంకితభావానికి ఫ్యాన్స్ ఫిదా

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించనున్న‌ చిత్రం 'ఆన్ సైలెంట్ మోడ్' (ప్రచారంలో ఉన్న పేరు). ఈ సినిమాకి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు.

పాటల చిత్రీకరణలో 'నేల టిక్కెట్టు'

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో

డబ్బింగ్ ప్రారంభించిన కీర్తి సురేష్

న‌టీమ‌ణి సావిత్రి బ‌యోపిక్‌గా ‘మహానటి’ సినిమా తెరకెక్కుతున్న‌ విషయం తెలిసిందే.

వెంకటేష్‌కే.. ఎందుకిలా?

విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్న సీనియ‌ర్‌ హీరో విక్ట‌రీ వెంకటేష్.

'2.O' లో ఐశ్వర్యా రాయ్!?

సూపర్ స్టార్ రజనీకాంత్, అందాల తార ఐశ్వర్యా రాయ్ జంటగా నటించిన చిత్రం ‘రోబో’.