క్రిష్ణాష్ట‌మి ఆడియో & మూవీ డేట్స్ ఫిక్స్..

  • IndiaGlitz, [Saturday,November 14 2015]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టిస్తున్నతాజా చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. సునీల్ స‌ర‌స‌న నిక్కి గ‌ల‌రాని, డింపుల్ చోపాడే హీరోయిన్స్ గా న‌టించారు.

ఈ చిత్రంలో సునీల్ ఎన్.ఆర్.ఐ గా న‌టించారు. అనుకోకుండా సునీల్ ఇండియాకి రావ‌డం...అక్క‌డ ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో క‌థ కీల‌క మ‌లుపు తీసుకుంటుంద‌ట‌. ఆద్యంతం ఆస‌క్తిగా ఉండే క్రిష్ణాష్ట‌మి ఆడియోను డిసెంబ‌ర్ 27న రిలీజ్ చేసి, సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న మూవీని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కి క్రిష్ణాష్ట‌మి విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

More News

ఈ నెల 18న 'అబ్బాయితో అమ్మాయి' ఆడియో

మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా ఒక చిత్రానికి పాటలు స్వరపరచాలంటే ముందు ఆయనకు కథ నచ్చాలి.

ఉగ్ర‌వాదుల దాడి నుంచి త‌ప్పించుకున్న రేణుదేశాయ్

న‌టి, నిర్మాత రేణు దేశాయ్ ఉగ్ర‌వాదుల దాడి నుంచి తప్పించుకున్నారు. గ‌త కొన్ని రోజులుగా రేణు దేశాయ్ ఫ్యారీస్ లో ఉగ్ర‌వాద‌లు దాడులు జ‌రుగుతున్న ప్ర‌దేశానికి ద‌గ్గ‌ర‌లో ప‌ర్య‌టించారు.

వెంకీ న్యూమూవీ టైటిల్ ఇదే

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల రిలీజై చాలా రోజులు అయ్యింది. కానీ...ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న్యూమూవీ సెట్స్ పైకి వెళ్ల‌లేదు.

లోఫ‌ర్ లో వ‌రుణ్ కి న‌చ్చింది అదే..

వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మించారు.

నిర్మాత‌గా మారుతున్న స్టార్ హీరో

యువ హీరో నితిన్ నిర్మాత‌గా మారి అఖిల్ సినిమా నిర్మించారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా నిర్మాత‌గా మారి తండ్రి చిరుతో 150వ సినిమా నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.