క్రితి శెట్టికి అవ‌కాశాల వెల్లువ

  • IndiaGlitz, [Monday,March 23 2020]

కన్న‌డ బ్యూటీ క్రితి శెట్టికి అవ‌కాశాలు వెల్తువెత్తుతున్నాయి. 2009లో క‌న్న‌డ చిత్రం ‘స‌రిగ‌మ‌’ చిత్రంతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత త‌మిళంలోనూ సినిమాలు చేసింది. అక్క‌డ నుండి తెలుగులోకి అడుగు పెట్టింది. మెగా మేన‌ల్లుడు సాయితేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించిన ఉప్పెన చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి అడుగు పెట్టింది. ఉప్పెన చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ప్ర‌భావంతో సినిమా వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా.. ఈ సినిమా టీజ‌ర్‌లో క్రితిశెట్టి ఎక్స్‌ప్రెష‌న్స్ న‌చ్చ‌డంతో ఆమెకు అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. సుకుమార్ నిర్మిస్తోన్న త‌న త‌దుపరి చిత్రంలోనూ క్రితిశెట్టికి అవ‌కాశం ఇచ్చాడు.

తాజాగా క్రితిశెట్టికి మ‌రో అవ‌కాశం రావ‌డం విశేషం. విశ్వ‌క్ సేన్ హీరోగా డెబ్యూ డైరెక్ట‌ర్ న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల పాగ‌ల్ అనే సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. బెక్కం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మాత‌. ఈ సినిమాలోనూ క్రితిశెట్టినే హీరోయిన్‌గా తీసుకున్నార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. తెలుగులో తొలి చిత్రం ఉప్పెన విడుద‌ల కాకుండానే రెండు సినిమాల్లో అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం నిజంగా క్రితి అదృష్ట‌మేన‌ని అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. మ‌రి సినిమా విడుద‌ల త‌ర్వాత ఎలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

More News

కరోనా నేపథ్యంలో దేశీయ విమాన సర్వీస్‌లు రద్దు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించిన కేంద్రం తాజాగా..

టాలీవుడ్ నటుడికి కరోనా లక్షణాలు.. గోప్యంగా..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌కూ సోకింది!. టాలీవుడ్‌కు చెందిన ఓ సహాయ నటుడికి కరోనా లక్షణాలున్నట్లు తెలుస్తోంది. 2 వారాల కిందట బ్యాంకాక్ నుంచి ఆయన హైదరాబాద్‌కు వచ్చాడని..

బాల‌య్య గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?

నంద‌మూరి బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమా సెకండ్‌ షెడ్యూల్ వాయిదా ప‌డింది. ఈ సినిమా త‌ర్వాత బాల‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని

గేమ్ షో లో క‌న్నీళ్లు పెట్టుకున్న అనుష్క‌

నిశ్శ‌బ్దం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా అనుష్క రీసెంట్‌గా ఓ గేమ్ షోలో పాల్గొన్నారు. ఇందులో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పారు స్వీటీ. అందులో భాగంగా సినిమాల్లో యాక్టింగ్‌, ప్ర‌భాస్‌తో స్నేహం వీటిలో

తెలంగాణ: పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. తాజాగా.. మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యిందని