అనారోగ్యంపై వచ్చిన వార్తలపట్ల కేటీఆర్ క్లారిటీ..

  • IndiaGlitz, [Tuesday,May 12 2020]

తెలంగాణ మంత్రి కేటీఆర్ అనారోగ్యంగా ఉన్నారని.. గత రెండు మూడ్రోజులుగా ఆయన బాధపడుతున్నారని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆప్తులు ఆందోళన చెందారు. కొందరు సోషల్ మీడియా వేదికగా అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయగా.. ఇంకొందరు కాల్ చేసి మరీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలా వార్తలు ఎక్కవవుతుండటం.. మరోవైపు ఇష్టానుసారం ప్రచారం జరుగుతోంది. ఇలా అందరూ ఆందోళన చెందుతుండటంతో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ స్పందించారు.

నేను ఆరోగ్యంగానే ఉన్నా..

‘నిన్నటి నుంచి నా ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నిన్న సిరిసిల్లలో పర్యటిస్తున్న సందర్భంగా అనేక సంవత్సరాలుగా నాకు జలుబుతో కూడిన ఎలర్జీ ఉంది. చాలా ఏళ్లుగా అలర్జటిక్ జలుబుతో బాధపడుతున్నాను. నిన్న సిరిసిల్ల వెళ్లేటప్పుడు కూడా అలాగే వచ్చింది. అకస్మాత్తుగా పర్యటన రద్దు చేసుకోలేక.. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చాలామందికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చింది’ అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చుకున్నారు. కేటీఆర్ స్పందించడంతో అభిమానులు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గింది.

నా లక్ష్యం అదే..

కాగా.. సోమవారం నాడు కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్స్ చేశారు. చేనేత సోదరులు, సోదరీమణుల ప్రతిభ పట్ల తాను ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. సిరిసిల్లలో చేనేత పని పునఃప్రారంభమైందని, బతుకమ్మ చీరలు నేయడం కొనసాగిస్తున్నారని ట్వీట్ చేశారు. సిరిసిల్ల చేనేత ఉత్పత్తులంటే ఓ ఎన్నదగిన బ్రాండ్‌గా అభివృద్ధి చేయడమే స్థానిక ఎమ్మెల్యేగా తన లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. ఈ స్వప్నం సాకారమవ్వాలంటే టెక్స్ టైల్ పార్క్, అప్పెరెల్ పార్క్ ఎంతో కీలకమని కేటీఆర్ తన మనసులోని మాటను చెప్పారు.

More News

కరోనా నుంచి కోలుకుంటున్న ఏపీ.. కేసులు తగ్గిపోతున్నాయ్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఇందుకు నిదర్శనమే గత నాలుగైదు రోజులుగా నమోదవుతున్న కేసులు.

మోదీ ఏం చెప్పబోతున్నారు.. దేశ ప్రజల్లో సర్వత్రా ఆసక్తి!

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 08 గంటలకు జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం

అర‌వింద్ రిక్వెస్ట్‌.. ప్ర‌భుత్వం ఒప్పుకుంటుందా?

కోవిడ్ 19 కార‌ణంగా ప్ర‌పంచం స్తంభించింది. ప‌లు రంగాలు చాలా న‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అలాంటి రంగాల్లో సినీ రంగం కూడా ఒక‌టి. లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత థియేట‌ర్స్‌ను మూసివేశారు.

కొత్త ప‌లుకులు ప‌ల‌క‌నున్న ముద్దుగుమ్ములు

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలంటే తెలుగు హీరోయిన్స్ మాత్ర‌మే న‌టించేవారు. కానీ ఓ ద‌శ‌కంలో ఉత్త‌రాదిన భామ‌లు, ఇత‌ర ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లు(తమిళ‌,

తెలుగు ఛానెల్‌పై కేసు వేస్తామంటోన్న కేజీయ‌ఫ్ నిర్మాత‌లు

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1’. ఈ సినిమా రెండో పార్టుగా ‘కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 2’ సెట్స్‌పై ఉంది.