చిలుకూరు పూజారికి కేటీఆర్ పరామర్శ


Send us your feedback to audioarticles@vaarta.com


చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై 20 మంది గుంపు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై ఈ దాడి జరిగింది. తనపై దాడి జరిగిందంటూ రంగరాజన్ పోలీసుల్ని ఆశ్రయించారు.
వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తెల్లవారుజామున తన ఇంట్లోకి ప్రవేశించి, తనపై మూకుమ్మడి దాడి చేశాడంటూ ఆయన ఫిర్యాదు చేశారు. రామరాజ్యం పేరిట వచ్చిన వ్యక్తుల మాటను నిరాకరించినందుకు.. తనపై, తన కుమారుడిపై దాడి చేశారని ఆయన కేసు పెట్టారు.
జరిగిన ఘటనను అంతా తీవ్రంగా ఖండించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రంగరాజన్ ను పరామర్శించారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు కేటీఆర్.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అధోగతి పాలయ్యాయని ఆరోపించారు కేటీఆర్. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదన్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ గారి కుటుంబ పరిస్థితే ఈ విధంగా ఉందంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు కేటీఆర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments