KTR: హీరోయిన్ల ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్

  • IndiaGlitz, [Wednesday,April 03 2024]

హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేయించారనే ఆరోపణలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టిపెట్టడం కాదు.. వాటర్ ట్యాప్‌లపై దృష్టిపెట్టాలని సూచించారు. ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరో హీరోయిన్లను బెదిరించానని తనపై ఓ మంత్రి విమర్శలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలకు భయపడే వ్యక్తిని కాదని.. ఇలాగే అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టాం తాట తీస్తాం అంటూ హెచ్చరించారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించిందని ఆరోపించారు. కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు అని.. 2023 ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే రాష్ట్రంలోని పల్లెల్లో సాగునీరు, పట్టణాల్లో తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. ప్రతి పట్టణంలో బిందెలతో ట్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల కష్టాల గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆ వివరాలు అన్నీ పంపిస్తామని తెలిపారు.

రేవంత్ రెడ్డి పార్టీ గేట్లు తెరవడం కాదు.. ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాలని సూచించారు. ధన వనరులను ఢిల్లీకి తరలించడంలో ఉన్న శ్రద్ద జల వనరులను తెలంగాణకు తేవడంలో లేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎలా ఓడగొట్టాలి.. ఎలా బెదిరించాలి.. ఢిల్లీకి డబ్బు సూట్ కేసులు ఎలా తరలించాలనే ధ్యాస తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ ముఖ్యమంత్రికి ఆలోచన లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై అనర్హత వేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి.. మళ్లీ వేరే పార్టీలో పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని కేటీఆర్ వెల్లడించారు.

కాగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశామని అరెస్ట్ అయిన అధికారులు తెలిపారు. దీంతో ఈ కేసు గులాబీ నేతల మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయా నేతలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాపింగ్ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారు. ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని.. త్వరలోనే అందరికి చట్టప్రకారం శిక్ష పడటం ఖాయమని స్పష్టంచేశారు.

More News

Telangana Congress: చేరికలతో బీఆర్ఎస్‌ పరిస్థితే కాంగ్రెస్‌కు రాబోతుందా..? జాగ్రత పడకపోతే పతనమేనా..?

అతివృష్టి అనావృష్టి ఉండకూడదు అంటారు. ఏదైనా మోతాదుకు మించి ఉండకూడదని దీని అర్థం. ఇదే సామెత ప్రస్తుత తెలంగాణ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగింది: సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలను కాపాడుకోవడానికి పొలం బాట పట్టి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఏపీలో పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల

ఏపీలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికలకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు

ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలు..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనగాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.