close
Choose your channels

భారత్ విజయం.. కులభూషణ్‌కు ఆగిన మరణశిక్ష

Thursday, July 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భారత్ విజయం.. కులభూషణ్‌కు ఆగిన మరణశిక్ష

భారత్‌కు చెందిన కుల్ భూషణ్ జాదవ్‌ విషయంలో కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. జాదవ్‌కు మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్-ఐసీజే) సంచలన తీర్పు వెలువరించింది. బుధవారం సాయంత్రం ఈ కేసులో పాకిస్థాన్ పునఃసమీక్ష చేసే వరకు కులభూషణ్ మరణశిక్ష అమలుపై స్టే విధించింది. దీంతో యావత్ భారత్ ఆనందంలో మునిగితేలుతోంది. ఇదిలా ఉంటే.. ఐసీజేలో భారత్‌కు అనుకూల తీర్పు రావడం పట్ల కేంద్ర వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దౌత్యంతో పాటు పలు విషయాల్లో పాకిస్థాన్‌పై పైచేయి సాధించిన భారత్, ఇప్పుడు న్యాయపరంగానూ విజయం సాధించినట్టయిందని.. ఇక ఇండియాకు తిరుగులేదన్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

భారత్, పాక్ జడ్జిలు సహా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. దీంతో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పాక్ మిలటరీ కోర్టు విధించిన శిక్షను పున:సమీక్షించాలని న్యాయమూర్తులు సూచించారు. భారత్ తరపున హరీశ్ పాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పాక్ మిలిటరీ కోర్టు కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించడం వియన్నా ఒప్పందం ప్రకారం సరికాదన్నారు.

కాగా.. భారత గూఢచార సంస్థ ‘రా’ కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డాడంటూ కుల్ భూషణ్‌ను 2016 మార్చి 3న పాకిస్థాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2017లో పాక్ మిలిటరీ కోర్టు ఏకపక్ష విచారణ జరిపి కుల్ భూషణ్ కు మరణశిక్ష విధించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.