అక్టోబర్ 30న 'కుమారి 21 ఎఫ్'

  • IndiaGlitz, [Friday,September 25 2015]

విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న యువ దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21 ఎఫ్' పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందిస్తున్నాడు. రాజ్‌తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు. హేభ పటేల్ నాయికగా నటిస్తున్న దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు ఈ చిత్రానికి ఫోటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు సుకుమార్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది' అని తెలిపారు.

నిర్మాతలు మాట్లాడుతూ సుకుమార్ భాగస్వామ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా వుంది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో రూపొందుతున్న చిత్రమిది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే చిత్రమిది. సుకుమార్ మార్క్‌లో కొనసాగే ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాల వారిని ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం వుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన వచ్చింది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసి అక్టోబర్‌లో ఆడియోను, అక్టోబర్ 30న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాంళ' అని తెలిపారు.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.

More News

న‌య‌న‌తార న‌మ్మింద‌ట‌

న‌యనతార ప్రధాన పాత్రలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి., శ్రీ శుభశ్వేత ఫిలింస్‌ పతాకాలపై అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు నిర్మించిన మయూరి చిత్రం

టెన్ష‌న్ లో క్రిష్..?

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం కంచె. ఈ చిత్రాన్ని క్రిష్ తెర‌కెక్కించారు.

చంద్రిక మూవీ రివ్యూ

హారర్ సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతున్న సమయమిది. కాంచన సీరీస్, ప్రేమకథా చిత్రమ్ వంటి సినిమాలన్నీ హిట్ అయిన నేపథ్యంలో ఈ మధ్య తక్కువ బడ్జెట్లో ఎక్కువగా హారర్ సినిమాలు వస్తున్నాయి.

బన్ని మొగ్గుతున్నరా?

బన్ని ప్రస్తుతం సరైనోడు సినిమాలో నటిస్తున్నారు.

తేజుకు మెగా అభినంద‌న‌

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. హారీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మించిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే స‌క్సెస్ టాక్ సొంతం చేసుకుంది.