లేడీ విలన్‌తో బాలయ్య ఢీ..?

  • IndiaGlitz, [Friday,April 10 2020]

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం షూటింగ్‌ను ఆపేసింది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా.. తాజా స‌మాచారం మేర‌కు ఈసినిమాలో ఓ లేడీ విల‌న్ న‌టించ‌నుంద‌ని టాక్‌. ఆమె ఎవ‌రో కాదు... భూమిక‌.

గ‌తంలో చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, వెంక‌టేశ్‌, నాగార్జున‌, ఎన్టీఆర్‌, మ‌హేశ్‌ల‌తో క‌లిసి న‌టించిన భూమిక ఇప్ప‌టి వ‌ర‌కు బాల‌కృష్ణ‌తో హీరోయిన్‌గా న‌టించలేదు. ఆయ‌న గ‌త చిత్రం రూల‌ర్‌లో ఓ కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే క‌న‌ప‌డింది. ఇప్పుడు మ‌రోసారి బాల‌య్య సినిమాలో న‌టించ‌నుంద‌ట‌. అది కూడా లేడీ విల‌న్ పాత్ర‌లో అంటున్నారు. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌య్య‌, బోయపాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూడో చిత్ర‌మిది. భారీ అంచ‌నాలున్నాయి. ఈ చిత్రంలో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తానంటోన్న రానా !!

రానా ద‌గ్గుబాటి హీరోగా డిఫ‌రెంట్ సినిమాలు చేస్తూ విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల కొంత కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

అందుకే సినిమాల‌కు దూర‌మ‌య్యానంటున్న శ్రీముఖి

బుల్లితెర‌, వెండితెర‌కు ఒక‌ప్పుడు దూరం ఎక్కువ‌గా ఉండేది. వెండితెర‌పై డీగ్లామ‌ర్ అయిన వారే బుల్లి తెర‌పై క‌నిపించ‌డానికి ఆస‌క్తి చూపేవారు.

క‌రోనాపై పోరుకు మ‌హేశ్ కొత్త ఆలోచ‌న‌..!!

కోవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డే ఆగిపోయింది. అన్నీ రంగాలు స్తబ్దుగా అయిపోవడం అభివృద్ధి ఆగిపోయింది. ఉన్న‌త, మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డం

నర్సింగ్‌ యాదవ్‌ పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ ఏపీలో పరీక్షలు

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా... వైరస్‌ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని