పవన్‌ గెలుస్తారో..? లేదో..? చెప్పేసిన లగడపాటి

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి రెండు చోట్ల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు చోట్లా పవన్ గెలుస్తారా..? లేకుంటే ఒక చోట గెలిచి మరోచోట కష్టమా..? లేదా రెండు చోట్లా ఓడిపోతారా..? ఇలా పెద్ద ఎత్తున బెట్టింగ్స్ నడుస్తున్నాయ్..! మరోవైపు పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. పవన్‌లోనూ ఇదే టెన్షన్ నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి.. అయితే పవన్ మాత్రం వాటి గురించి స్పందించకపోవడంతో తనపై తనకే నమ్మకం లేదని అందుకే ఆయన ఇలా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి.

పవన్ గెలుస్తాడా.. లేదా..?

అయితే తాజాగా.. అసలు పవన్ గెలుస్తారా? లేదా? అన్నది ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పేశారు. శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాలకు సంబంధించి కొన్ని లీకులు వదిలారు. ఈ సందర్భంగా పవన్ ప్రస్తావన రాగా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతారు. మెగాస్టార్‌ చిరంజీవికంటే కొద్దిగా తక్కువగానే ఉంటారు అని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో మెగాభిమానులు, జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

అయితే లగడపాటి చెప్పినవన్నీ నమ్మడానికి వీల్లేదని.. తెలంగాణ ఎన్నికల్లో ఆక్టోపస్ సర్వే అట్టర్ ప్లాప్ అయ్యిందని.. ఏపీలో కూడా ఆయన చెప్పింది నమ్మే ప్రసక్తే లేదని కొందరు జనాలు చెప్పుకుంటున్నారు. సో.. ఆదివారం సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. అయితే బ్యాలెట్‌లోని నేతల భవిష్యత్తు మాత్రం ఫైనల్‌గా మే-23న వెలువడనుంది.

More News

గాడ్సేకు ఫ్యాన్ క్లబ్.. బీజేపీకి గుత్తాజ్వాల చురకలు! 

మహాత్మా గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ నేతలు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి హెగ్డే, కర్ణాటక నేత నలిన్ కుమార్‌

టీవీ9 వివాదం: మరో షాకింగ్ ‘గరుడ పురాణం’ చెప్పిన శివాజీ!

టీవీ9 షేర్ల వివాదంలో ఈ చానెల్ మాజీ సీఈవో.. రవిప్రకాష్, గరుడ పురాణం శివాజీ ఇద్దరూ పరారీలో ఉన్న విషయం విదితమే.. వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

'వెంకీ మామ‌' టీజ‌ర్ ఎప్పుడో తెలుసా?

విక్ట‌రీ వెంక‌టేష్‌, అక్కినేని నాగ‌చైత‌న్య నిజ జీవితంలోనే కాదు.. రీల్ లైఫ్‌లోనూ మామ అల్లుళ్లుగా న‌టిస్తున్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్ర‌మే 'వెంకీ మామ‌'.

నాని కార‌ణంగా నాగ్ వెనక్కి..

కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 'మ‌న్మ‌థుడు 2'. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ముందుగా నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 29న విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు.

థియేట‌ర్స్ నిర్మాణంలోకి అజ‌య్ దేవ‌గ‌ణ్‌

బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌కి న‌ట‌న‌తో పాటు సినిమా సంబంధిత వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ హౌస్‌, వి.ఎఫ్‌.ఎక్స్ కంపెనీ .. ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు