ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన లక్ష్మీపార్వతి

  • IndiaGlitz, [Thursday,May 09 2019]

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇంకా ఏపీలో విడుదల కాలేదు. అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు వైసీపీ నేత లక్ష్మి పార్వతి పలమనేరుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని చానెల్ సర్వేలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది తెలుసుకొని జగన్‌ను హత్య చేయించాలనే ఉద్దేశంతో శ్రీనివాస రెడ్డిని కోడి కత్తితో ఉసిగొల్పి చంపించాలని చూశారని టీడీపీ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 650 రకాల హామీలు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

పుట్టుక నుంచి చచ్చే వరకు...

హంద్రీనీవా నీళ్లు అన్నారు కానీ రెండు రోజులు కూడా రాలేకపోయాయి చివరిగా ప్రజలను మభ్య పెట్టాలని పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్లను తన వైపు తిప్పుకోవాలని కూడా చూశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు ఓటమిని చవి చూస్తారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు నవరత్నాలు ఒక మనిషి పుట్టుక పుట్టుక నుంచి చచ్చే వరకు అన్ని రకమైన పథకాలు ఈ నవరత్నాలలో ప్రజలకు కావలసిన విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఈసారి తప్పకుండా వైసీపీని గెలిపించి.. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని మనస్ఫూర్తిగా జరుగుతుందని తెలిపారు.

జగన్ 2019 ఎన్నికలల్లో ఖచ్చితంగా సీఎం అవుతారని మా సర్వేలో వైసీపీకి 120 సీట్లు తప్పకుండా వస్తాయన్నారు.

చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సినిమాను.. సినిమాగానే చూడాలని నిర్మాతలకు నష్టం వచ్చేలాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అయితే పార్వతి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్పిందే మరి.

More News

గుణ టైటిల్ వివాదం

క‌ళాధ‌ర్ కొక్కొండ  న‌టిస్తూ ,   స్వీయ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  చిత్రం గుణ‌. న‌టులు సెల్వ‌రాజ్ , దిల్ ర‌మేష్  ముఖ్య‌పాత్ర‌లు పోషిస్తున్నారు.. స‌నాతన క్రియేష‌న్స్ బ్యాన‌ర్

మంత్రి పదవికి కిడారి శ్రావణ్ రాజీనామా.. మే23న తేలనున్న భవితవ్యం!

కిడారి శ్రావణ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం మంత్రి నారా లోకేశ్‌తో రాజీనామా విషయమై నిశితంగా చర్చించిన అనంతరం కిడారి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  చేసుకున్న రొమాంటిక్ క్రిమినల్స్

ఒక రొమాంటిక్ క్రైమ్ క‌థ, ఒక క్రిమిన‌ల్ ప్రేమ‌ క‌థ‌ లాంటి సందేశాత్మ‌క, క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రాలు అందించ‌డమే కాకుండా కంటెంట్ వున్న చిత్రాల‌కు పెద్ద బ‌డ్జెట్ అవ‌స‌రం లేద‌ని నిరూపించి టాలీవుడ్

'నా పేరు రాజా' లోగో అండ్ టీజ‌ర్ లాంచ్‌!!

అమోఘ్ ఎంట‌ర్ ప్రైజెస్ ప‌తాకంపై రాజ్ సూరియ‌న్ హీరోగా ఆకర్షిక‌, నస్రీన్  హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో

రవిప్రకాష్ కోసం పోలీసుల గాలింపు

తెలుగులో టాప్ చానల్‌గా పేరొందిన టీవీ9 గత ఏడాది ఆగస్టు నుంచి వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వ్యవహారం మరో కొత్త మలుపు తిరిగింది. ఈసారి ఏకంగా సదరు చానెల్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్న రవిప్రకాష్