close
Choose your channels

ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన లక్ష్మీపార్వతి

Thursday, May 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో గెలుపెవరిదో తేల్చేసిన లక్ష్మీపార్వతి

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు తెరెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇంకా ఏపీలో విడుదల కాలేదు. అసలు రిలీజ్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డితో పాటు వైసీపీ నేత లక్ష్మి పార్వతి పలమనేరుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో అన్ని చానెల్ సర్వేలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఇది తెలుసుకొని జగన్‌ను హత్య చేయించాలనే ఉద్దేశంతో శ్రీనివాస రెడ్డిని కోడి కత్తితో ఉసిగొల్పి చంపించాలని చూశారని టీడీపీ విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు 650 రకాల హామీలు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

పుట్టుక నుంచి చచ్చే వరకు...

"హంద్రీనీవా నీళ్లు అన్నారు కానీ రెండు రోజులు కూడా రాలేకపోయాయి చివరిగా ప్రజలను మభ్య పెట్టాలని పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి వాళ్లను తన వైపు తిప్పుకోవాలని కూడా చూశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు ఓటమిని చవి చూస్తారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు నవరత్నాలు ఒక మనిషి పుట్టుక పుట్టుక నుంచి చచ్చే వరకు అన్ని రకమైన పథకాలు ఈ నవరత్నాలలో ప్రజలకు కావలసిన విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా ఈసారి తప్పకుండా వైసీపీని గెలిపించి.. జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తారని మనస్ఫూర్తిగా జరుగుతుందని తెలిపారు.

జగన్ 2019 ఎన్నికలల్లో ఖచ్చితంగా సీఎం అవుతారని మా సర్వేలో వైసీపీకి 120 సీట్లు తప్పకుండా వస్తాయన్నారు.

చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని సినిమాను.. సినిమాగానే చూడాలని నిర్మాతలకు నష్టం వచ్చేలాగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు" అని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. అయితే పార్వతి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్పిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.