close
Choose your channels

తెలంగాణలో తాజాగా 1931 కేసులు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు

Thursday, August 13, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దాదాపు 2000 దాకా కేసులు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. తాజాగా కరోనా హెల్త్ బులిటెన్‌ను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23,303 పరీక్షలు నిర్వహించగా.. 1931 మందికి కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 86475కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 665 మంది మృతి చెందారు.

కాగా.. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 1780 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకూ 63074 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22736 యాక్టివ్ కేసులున్నాయి. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 298 కేసులు, జగిత్యాల 52, జనగామ 59, గద్వాల్ 56, కరీంనగర్ 89, ఖమ్మం 73, మల్కాజ్‌గిరి 71, నాగర్ కర్నూల్ 53, నిజామాబాద్ 53, నల్గొండ 84, పెద్దపల్లి 64, సిరిసిల్ల 54, రంగారెడ్డి 124, సంగరెడ్డి 86, సిద్దిపేట 71, సూర్యాపేట 64, వరంగల్ అర్బన్ 144 కేసులు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 6,89,150 టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా ట్విట్టర్‌లో మాత్రం ఈ బులిటెన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ‘మీరు ఈ డేటాను నమ్ముతారా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఈ బులిటెన్‌పై 420 చీటింగ్ కేసు వేయాలని ఒకరు.. అసలు ఈ బులిటెన్ చూస్తుంటే ఇంట్రస్ట్ అంతా పోతోందని మరొకరు.. ఫేక్ న్యూస్.. ఫేక్ బులిటెన్ అంటూ ఇంకొకరు మొత్తం మీద ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్‌పై నెటిజన్ల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.