కంగ‌నాకు షాక్‌.. లీగ‌ల్ నోటీసులు

  • IndiaGlitz, [Sunday,January 17 2021]

ఫ‌ర్ బ్రాండ్ కంగనా ర‌నౌత్.. ఈ పేరు చెబితే కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అనే పేరే ముందుగా వినిపిస్తుంది. బాలీవుడ్‌లో చాలా మంది కంగ‌నా ర‌నౌత్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారే. అయినా ఆమె ఏమీ ప‌ట్టించుకోదు. ఏకంగా శివ‌సేన ప్ర‌భుత్వంతోనే గొడ‌వ‌లు పెట్టుకుంది. ఇలాంటి తల‌నొప్పి అమ్మ‌డుకే ఒక‌డు త‌లనొప్పి తెప్పించాడంటే... వాడెంత‌టి ఘ‌నుడో అనుకోవాలి. ఓ వ్య‌క్తి ఏకంగా కంగ‌నార‌నౌత్‌కు కోర్టు నోటీస‌లు పంపాడు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. అశిష్ కౌల్‌. ఈయ‌న ఓ రైట‌ర్‌. ఈయ‌న‌కు, కంగ‌నాకు ఏంటి గొడ‌వ అని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకి వెళితే.. అశిష్ కౌల్ ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ అనే పుస్త‌కాన్ని రాశాడు. ఈ పుస్త‌కం ఇంగ్లీష్ వెర్ష‌న్ విడుద‌లై నాలుగేళ్లు అవుతుంది. హిందీ స‌హా ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

అయితే ఇప్పుడు త‌న అనుమ‌తి లేకుండా ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’ సినిమాను చేయ‌డ‌మేంటి? అని అంటున్నాడు. అందుకు కార‌ణం.. ‘దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి’కి సంబంధించి పూర్తి హ‌క్కులు త‌న ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని ఆశిష్ కౌల్ అంటున్నాడు. త‌న అనుమ‌తి లేకుండా సినిమాను చేస్తామ‌ని చెప్పిన కంగ‌నాకు ఆశిష్ కౌల్ లీగ‌ల్ నోటీసుల‌ను పంపాడు. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై కంగ‌నా ర‌నౌత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత‌గాథ‌ను మ‌ణిక‌ర్ణిక .. ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చింది కంగ‌నా ర‌నౌత్‌. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా కాశ్మీర్ రాణి దిద్దా జీవిత‌గాథ‌ను మ‌ణిక‌ర్ణిక‌ ది లెజెండ్ ఆఫ్ దిద్దా పేరుతో తెర‌కెక్కించ‌నున్నామ‌ని తెలిపింది.మ‌రిప్పుడు ఈ హ‌క్కుల గొడ‌వ ఎంత వ‌ర‌కు వెళుతుందో చూడాలి.

More News

వరుణ్ తేజ్ బర్త్ డే స్పెషల్ సిద్ధం

డిప‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే వ‌రుణ్ తేజ్ ..‘ఎఫ్ 2’, ‘గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్’ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

అఖిల్ కోసం భారీ స్టార్ కాస్ట్‌..!

అఖిల్ అక్కినేని హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

మూడో స్థానంలో జగన్.. కేసీఆర్ ఎక్కడ?

సీఎం కేసీఆర్.. తెలంగాణ పోరులో ముందు వరుసలో నిలిచారు. తెలంగాణ రావడంలో కీలకమయ్యారు.

మోదీ నోట గురజాడ మాట.. ఖుషీ అవుతున్న తెలుగు ప్రజలు

మహాకవి గురజాడ అప్పారావు మాటలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. నేడు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ను మోదీ ప్రారంభించారు.

మాలీవుడ్‌పై రామ్‌ ఫోకస్‌...

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెడ్‌'. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రంలో రామ్‌ తొలిసారి ద్విపాత్రాభినయం చేశాడు.