Balakrishna: బాలయ్య మాటలు తప్పుగా అనిపించలేదు.. విషయాన్ని సాగదీయొద్దు : ఎస్వీఆర్ వారసుల విజ్ఞప్తి

  • IndiaGlitz, [Thursday,January 26 2023]

‘‘వీరసింహారెడ్డి’’ సక్సెస్ మీట్‌లో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మహానటులు ఎస్వీఆర్, ఏఎన్ఆర్‌లను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వారి ఫ్యాన్స్‌తో పాటు కొన్ని సామాజిక వర్గాలు సైతం భగ్గుమంటున్నాయి. బాలయ్య బేషరతుగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో భారీగా నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి అక్కినేని ఫ్యాన్స్ బాలయ్య దిష్టి బొమ్మలను దగ్థం చేశారు. అటు ఏఎన్ఆర్ మనవళ్లు కూడా బాలయ్యకు సున్నితంగా చీవాట్లు పెట్టారు.

ఈ నేపథ్యంలో ఎస్వీఆర్ వారసులు కూడా వివాదంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మనవళ్లు జూనియర్ ఎస్వీ రంగారావు, ఎస్‌విఎల్ఎస్ రంగారావులు బుధవారం వీడియో బైట్ రిలీజ్ చేశారు. అందులో వారు ఏమన్నారంటే.. ‘‘ బాలయ్య మాట్లాడిన కొన్ని విషయాలపై సోషల్ మీడియా, మీడియాలో విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా.. తమకు , బాలకృష్ణకు మంచి అనుబంధం వుంది. మేమంతా ఒక కుటుంబంగా వుంటాం. తోటి నటుడితో జరిగిన ఓ సంభాషణ గురించి బాలయ్య సాధారణ పోకడలో చెప్పారని, ఇందులో ఎస్వీఆర్ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు. మీడియాలో ఈ విషయాన్ని ఇంకా సాగదీయవద్దు, మాకు , నందమూరి కుటుంబానికి వున్న అనుబంధాన్ని చెడగొట్టొద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.

వివాదానికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్న అభిమానులు :

మరోవైపు టాలీవుడ్‌లోని రెండు పెద్ద కుటుంబాల మధ్య వచ్చిన ఈ వివాదం త్వరగా సమసిపోవాలని సగటు ప్రేక్షకుడు కోరుకుంటున్నారు. దీనిని ఇంకా పెద్దది చేయడం వల్ల చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బ తింటుందని పలువురు అంటున్నారు. వివాదం మొదలైంది బాలయ్య వైపు నుంచి కాబట్టి.. ఇటీవల ఓ సామాజిక వర్గం విషయంలో ఓపెన్ లెటర్ ద్వారా సారీ చెప్పినట్లుగానే, నందమూరి కుటుంబానికి అత్యంత ఆప్తులైన అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పి తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారని పరిశ్రమ పెద్దలు ఆశిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

More News

Agni Nakshatram: పోస్ట్ ప్రొడక్షన్ దశలో 'అగ్ని నక్షత్రం'

లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై కలెక్షన్ కింగ్ డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'అగ్ని నక్షత్రం'.

Pawan Kalyan : ఏపీలో అడుగుపెట్టిన ‘‘వారాహి’’.. దుర్గమ్మ ఆశీస్సులు పొందిన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాష్ట్ర వ్యాప్త పర్యటనల కోసం సిద్ధం చేసిన ‘‘వారాహి’’ ప్రచార రథం ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది.

Sharwanand: బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్ స్టాప్.. ఇంటివాడు కాబోతున్న శర్వానంద్, అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్‌ తెలిస్తే షాకే

భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా వున్న నటీనటులు ఒక్కొక్కరిగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే.

Vijay Antony : నేను బాగానే వున్నా.. హాస్పిటల్ బెడ్‌పై నుంచే విజయ్ ఆంటోనీ ట్వీట్

బిచ్చగాడుతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోనీ ఇటీవల షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan : ఇకపై తెలంగాణపైనా ఫోకస్.. 10 మంది జనసేన ఎమ్మెల్యేలు వుండాల్సిందే : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమవుతారా .. లేదంటే తెలంగాణలోనూ ఎంట్రీ ఇస్తారా అంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించారు.