నవంబర్‌ 30న 'లెజెండ్స్‌' లైవ్‌ కాన్సర్ట్‌

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

కె.జె. ఏసుదాస్‌, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కెయస్‌ చిత్ర లాంటి లెజెండరీ సింగర్స్‌ తో ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో సంయుక్తంగా ‘లెజెండ్స్‌’ సంగీత కచేరిని నవంబర్‌ 30న హైదరాబాద్‌లోని గౌచ్చిబౌళి స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్‌ ఆధ్వర్యంలో జరగునుంది.

ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పాత్రికేయు ల సమావేశంలో ఎస్పీ బా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ...‘‘ తెలుగు లో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. నేను, ఏసుదాస్‌ గారు , చిత్ర ముగ్గురం ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలు మాత్రమే పాడనున్నాం. గతంలో వేరే కంట్రీస్‌లో సంగీత కచేరీ చేశాం. కానీ తె లుగులో ఇదే ప్రథమం. ఇంతకు ముందు సింగపూర్‌లో మా అబ్బాయి చరణ్‌, ఎలెవన్‌ పాయింట్‌టు మరియు బుక్‌ మై షో వారు దీన్ని అద్భుతంగా నిర్వహించారు. ఇక్కడ కూడా అదే విధంగా ఎంతో ప్లాన్డ్‌గా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి ప్రొఫెషనల్స్‌ అయిన మ్యుజిషియన్స్‌ ఈ లైవ్‌ షోకు మ్యూజిక్‌ బ్యాండ్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్ట్రింగ్స్‌ సెక్షన్‌లో ఏఆర్‌ రహమాన్‌ మ్యూజిక్‌ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన వారు ప్లే చేయనున్నారు. అలాగే రహమాన్‌ కు రైట్‌ హ్యాండ్‌ అయిన శ్రీనివాస మూర్తి కండక్టర్‌గా వ్యవహరించనున్నారు. అన్న ఏసుదాస్‌ గారి పాటతో ప్రారంభమయ్యే ఈ సంగీత కచేరిలో అందరికీ ఇష్టమైన తెలుగు పాటలు పాడనున్నాం. ఇక ఇది కమర్షియల్‌ షో నా? అంటే అవునను చెప్పవచ్చు. ఎంతో ఎక్స్‌పెన్సివ్‌తో కూడింది . వ్యాపార ధోరణిలో చేస్తోన్న ఓ అందమైన సాంస్కృతిక కార్యక్రమం అని చెప్పవచ్చు’’ అన్నారు

ఎస్పీ చరణ్‌ మాట్లాడుతూ...‘‘ ఏసుదాస్‌గారు, నాన్నగరారు, చిత్రగారు ఇలా ముగ్గురు ఒక వేదికపై ఆ లపించడం నాతో పాటు అందరికీ వీనుల విందుగానే ఉంటుంది. ఈ లైవ్‌ కాన్సర్ట్‌ రెగ్యులర్‌గా చేయాలని ఉన్నప్పటికీ ముగ్గురు చాలా బిజీగా ఉండటంతో వారి టైమ్‌, డేట్స్‌ తీసుకుని చేయడం వలన చాలా గ్యాప్‌ వస్తోంది. ఇక ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తాం. ఇప్పటి వరకు మేము చేసిన ‘లెజెండ్స్‌’ ఏ లైవ్‌ కాన్సర్ట్‌’ అంతటా మంచి సక్సెస్‌ అయింది. హైదరాబాద్‌లో నవంబర్‌ 30న గచ్చిబౌళి స్టేడియంలో గ్రాండ్‌గా చేస్తున్నాం. ఈ ముగ్గురు లెజెండ్స్‌ ఇప్పటి వరకు తెలుగులో ఎన్నో వేల పాటలు పాడారు. అందులో కొన్ని పాటలు సెలెక్ట్ చేయడం అంటే కొంచెం ఇబ్బందే. అయినా కూడా శ్రోత లకు బెస్ట్‌ సాంగ్స్‌ అందించే ప్రయత్నం చేస్తాం’’ అన్నారు.

More News

`రాక్ష‌సుడు` చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించ‌డం ఆనందంగా ఉంది - నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియో బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మించిన చిత్రం `రాక్షసుడు`.

‘మెగాస్టార్’ నేను కాదు.. ఆయన్ను ఎవరూ రీచ్ కాలేరు!

స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా న‌రసింహారెడ్డి’.

'సైరా న‌ర‌సింహారెడ్డి' టీజ‌ర్ విడుద‌ల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌గా సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

‘సాహో’కు చెర్రీకి సంబంధమేంటి!?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆగస్టు 30న అభిమానుల ముందుకు రాబోతోంది.

‘అమరావతి’ షిప్ట్ కానుందా.. అసలేం జరుగుతోంది!?

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కాదా..? అమరావతి కాకుండా మరో చోటికి రాజధానిని మార్చేస్తారా..?