బన్నితో సినిమా చేస్తున్నాను: లింగుస్వామి

  • IndiaGlitz, [Sunday,February 26 2017]

పందెంకోడి సినిమాతో తెలుగు, త‌మిళంలో పెద్ద హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తెలుగు, త‌మిళంలో ఓ సినిమా తెర‌కెక్కాల్సింది. అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు ఈ బ‌న్ని, లింగుస్వామి సినిమా ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌న్నింటినీ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఖండించాడు. ఇందుకు ట్విట్ట‌ర్‌ను వేదిక‌గా చేసుకున్నాడు. ప్ర‌స్తుతం విశాల్ హీరోగా రూపొందిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాన‌ని, త్వ‌ర‌లోనే పందెంకోడి-2 సెట్స్‌లోకి వెళ్ళ‌నుంది. పందెంకోడి సీక్వెల్ పూర్త‌యిన త‌ర్వాతే బ‌న్నితో సినిమా స్టార్ట్ అవుతుంద‌ని లింగుస్వామి..బ‌న్ని, త‌న కాంబినేష‌న్ మూవీ ఆగిపోలేద‌ని చెప్పేశాడు.

More News

తెలుగు సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, మంచి వ్యక్తిని కోల్పోయింది: బాలకృష్ణ

'ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూయడం చాలా బాధాకరం.

పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో సపోర్ట్ చేస్తాః నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రాజకీయాల పరంగా తన సపోర్ట్ తన తమ్ముడికే ఉంటుందని చెప్పేశాడు.

దుబాయ్ వెళుతున్న జగన్నాథమ్...

ఆర్య,పరుగు సినిమాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,నిర్మాత దిల్రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం'డిజె దువ్వాడ జగన్నాథమ్'.

జవాన్ గా రానా...

రీసెంట్ గా ఘాజీ సినిమాతో సక్సెస్ అందుకున్నదగ్గుబాటి రానా,కెరీర్ తొలి నాళ్ళ నుండి విలక్షణ చిత్రాలు చేస్తూ వస్తున్నాడు.

సునీల్ నిర్మాతపై కేసు నమోదు...

హీరో సునీల్ తో ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత పరుచూరి కిరిటీ.