close
Choose your channels

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

Saturday, March 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లాక్‌డౌన్ పొడిగిస్తున్నాం.. ఇళ్లలో నుంచి బయటికి రాకండి : కేసీఆర్

తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తున్నామని.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఏప్రిల్-15 వరకు ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ఈ విషయాన్ని తెలిపారు. కరోన వ్యాధికి సంబంధించి మన రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 59 అని.. ఇప్పుడు 58 మంది ట్రీట్మెంట్‌లో ఉన్నారని తెలిపారు. మరో 20 వేల మంది హోమ్ క్వారంటైన్‌లో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నారని కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేసులు వచ్చాయి. ప్రజలకి ధన్యవాదాలు, లాక్ డౌన్‌కు చాలా సహకారాన్ని అందిస్తున్నారన్నారు. నిజంగా.. మనం ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే మనం ఇబ్బందులు పడేవారమన్నారు.

ప్రధానితో మాట్లాడా..!

‘ప్రపంచంలో దీనికి మందు లేదు. ప్రపంచ దేశాలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దీనిని అరికట్టేందుకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని.. ఇది అందరూ పాటించాలి. అమెరికా లాంటి దేశం కూడా ఈ వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవడానికి సోషల్ డిస్టన్స్ (సామాజిక దూరం)మాత్రమే. అమెరికా, స్పెయిన్, ఇటలీ స్థాయిలో ఇండియాలో వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారు. దీనికి ప్రతి ఒక్కరు దయచేసి స్వీయనియంత్రణ పాటించాలి. మనం దీన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఉదయం నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడాను. వారు కూడా రాష్ట్రానికి కావలసిన సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావొద్దు..!

‘80.9 శాతం మైల్డ్ వీరికి ఇబ్బంది ఉండదు. వీరు తట్టుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఇంకొకరి మీద ఆధారపడి ఉండకుండా వైద్యులు, నర్సులు, ఇతర ఏర్పాట్లపై నిన్న అంత చర్చించాం. డాక్టర్లకు, నర్సులకు ఇతర సిబ్బందికి కావాల్సిన భోజనం, ఇతర ట్రాన్స్‌పోర్ట్ కావాల్సినవన్నీ సిద్ధం చేశాం. 1400 ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం అవుతున్నాయి. వెంటిలేటర్ కూడా 500 ఆర్డర్ ఇచ్చాము. 11500 మంది ఐసోలేషన్‌లో ఉంచేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 60 వేల మందికి ఈ వైరస్ సోకిన వారికి కూడా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రిటైర్డ్ డాక్టర్ల అందర్నీ గుర్తించాం.. ఇతర స్టాప్‌ను కూడా తీసుకుని వైద్యం అందిస్తాం. 14 వేల అదనపు డాక్టర్ల బృదం‌ను సిద్ధం చేస్తున్నాను. ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు రావద్దు. దయచేసి ప్రభుత్వ, పోలీస్, వైద్య సిబ్బందికి సహకరించాలి’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

గుంపులు గంపులుగా వెళ్లొద్దు..!

‘ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీపై ప్రభుత్వం, పోలీస్ సిబ్బంది సహకరించాలి.. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి కూడా విజ్ఞప్తి మీకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తుంది. మీరు ఇబ్బంది పడొద్దు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దు. 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి. పంట చేతుకు వచ్చే సమయం ఇది,పంట చేతికి వస్తేనే మనం తింటాం. ఎస్సార్ ఎస్పీ, నాగార్జున సాగర్, జూరాల కింద నీళ్లు ఏప్రిల్ 10వ తేదీ వరకు సప్లై చేయాలని కోరాం. చాలా మంది మంత్రులతో మాట్లాడను.. అందరూ కూడా ఇదే చెప్పారు. ఏప్రిల్ 10 వ తేదీ వరకు నీళ్లు ఇస్తాం. ఒక్క ఎకరం పంట కూడా ఎండకుండా పంట పండించుకోవాలి. ఇవాళ పిక్ డిమాండ్ 9 వేలు, పగలు రాత్రులు కష్టపడి నిరంతరం విద్యుత్ ఇవ్వాలని చెప్పారు ప్రభాకర్ రావు గారు. విద్యుత్ సరఫరా జరిగే విధంగా విద్యుత్ సిబ్బంది పని చేయాలి. కూరగాయలకు ఒక్కసారి పోవద్దు దయచేసి, ప్రజాప్రతినిధులు కూడా గుంపులు గంపులుగా వెళ్లవద్దు. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలికి గురికావద్దు’ అని కేసీఆర్ సూచించారు.

వారందరికీ హామీ ఇస్తున్నా..!

‘ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. హౌస్ బిల్డింగ్ కాకుండా ఇరిగేషన్‌లో, రైస్ మిల్‌లలో కూడా ఎక్కడి నుంచో వచ్చి పని చేస్తారు. వారికి మేము విజ్ఞప్తి చేశాం.. వారికి కూలీలు ఇవ్వాలని, అన్నం కూడా పెట్టాలని చెప్పారు. అంతేకాదు మున్సిపల్ మంత్రితో క్రీడాయ్ వాళ్ళు కలిసి అన్నివిధాలా ఆదుకుంటాం అన్నారు. కలెక్టర్‌లకు కూడా చెప్తున్నా అందరిని ఆదుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న కార్పోరేషన్‌లలో చాలా మంది కూలీలు ఉన్నారు.. వారికి అందరికి అండగా ఉండాలి కోరుతున్నాం.. వారిని ప్రభుత్వం ఆదుకోండి. మున్సిపల్ శాఖ మంత్రితో సమన్వయం చేసుకొని ఉండాలి. హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.. కాబట్టి హాస్టల్‌లు మూసివేయడం లేదు. పేదలు,బిక్షగాళ్ళు, అనాధాశ్రమాల్లో ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.