తెలంగాణలో మరోసారి లాక్‌డౌన్.. రాత్రిపూట కర్ఫ్యూ?

  • IndiaGlitz, [Tuesday,March 23 2021]

కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చిందని అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకూ రెండు వందలకు పరిమితమైన కేసులు తాజాగా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం నాలుగు వందలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి అప్రమత్తమవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను ప్రజలకు వెల్లడిస్తున్నాయి. అంతే కాకుండా తమ తరుఫున ఏం చేయాలనే దానిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం హుటాహుటిన వైద్యశాఖాధికారులతో తాజాగా సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడిన మాటలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యమని మంత్రి ఈటల అన్నారు. కోవిడ్‌ పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు. ప్రజలంతా భౌతిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈటల ప్రజలను కోరారు.

మొత్తానికి తెలంగాణలో పరిస్థితి దారుణంగానే ఉందని తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేయబోతున్నట్టు సమాచారం. తెలంగాణలో లాక్ డౌన్ విధించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూ..? పెట్టబోతున్నారని కూడా సమాచారం. ఇప్పటికే మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతోపాటు రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేసులు పెరగకుండా చూసేందుకు తగు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లాక్ డౌన్.. కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.

More News

విడుదలకు ముందే... ‘మరక్కర్’కు 3 జాతీయ అవార్డులు..

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్రం 67వ జాతీయ చలన చిత్ర వివరాలను వెల్లడించింది.

ర‌వితేజ రివేంజ్ డ్రామా..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు ఖిలాడి సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజి బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌వ‌గానే నెక్ట్స్ మూవీని త్రినాథ‌రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో

టాలీవుడ్ ఎంట్రీ కోసం సూర్య అదిరిపోయే స్కెచ్‌..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎప్పుడో టాలీవుడ్‌లో త‌న‌దైన మార్క్ క్రియేట్ చేసుకుని ఓ మార్కెట్‌నుక్రియేట్ చేసుకున్నాడుగా,

ఫ‌హాద్ ఫాజిల్‌కు ‘పుష్ప’ కోసం ఇస్తున్న రెమ్యున‌రేష‌న్ ఎంతంటే?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, వెర్సటైల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప’.

డ‌బ్బింగ్ షురూ చేసిన ‘వ‌కీల్ సాబ్‌’

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. బాలీవుడ్ చిత్రం పింక్‌కు ఇది రీమేక్ అనే సంగ‌తి అందరికీ తెలిసిందే.