close
Choose your channels

Rahul Gandhi : రాహుల్ గాంధీకి దెబ్బ మీద దెబ్బ .. ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు

Monday, March 27, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇప్పటికే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయి తీవ్ర నిరాశలో కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మర్ షాక్ తగిలింది. ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ ప్యానెల్ సోమవారం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 22 వరకు డెడ్‌లైన్ విధించింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన నాటి నుంచి రాహుల్ గాంధీకి ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లో బంగ్లాను కేటాయించింది ప్రభుత్వం. అయితే ఆయనపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేయడంతో .. ప్రభుత్వ బంగ్లాలో వుండేందుకు రాహుల్ అర్హత కోల్పోయినట్లు ప్యానెల్ నోటీసుల్లో పేర్కొంది.

రాహుల్ గాంధీపై అనర్హత వేటు :

లోక్‌సభ ఎన్నికలకు కొద్దినెలల ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగ్గిలిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేస్తూ గతవారం లోక్‌సభ సచివాలయం ఆదేశాలు జారీ చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్స విధించిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఇ)లోని నిబంధనల ప్రకారం.. రాహుల్ గాంధీ దోషిగా తేలిన తేదీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడైనట్లు లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారం ప్రకటించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్‌సభ తెలిపింది.

అసలేంటీ వివాదం :

కాగా.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కర్ణాటకలోని కోలార్‌లో ఓ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక నేరగాళ్లు లలిత్ మోడీ, నీరవ్ మోడీల పేర్లను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు వుంటోందోనంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుబట్టారు. అంతేకాదు.. అప్పట్లోనే రాహుల్‌పై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ పరువు నష్టం దావా వేశారు. దీనిపై సూరత్‌లోని చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ నాలుగేళ్లుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో గురువారం న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడిగా వున్నందున, ఆయన ప్రసంగాలకు ప్రభావం ఎక్కువన్నారు. తక్కువ శిక్ష వేస్తే దీని వల్ల భవిష్యత్తులో ఎవరిపైనైనా సులువుగా నిందలు వేస్తారని .. గతంలోనూ ఇలాగే వ్యవహరించి క్షమాపణలు సైతం చెప్పారని న్యాయమూర్తి గుర్తుచేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ ప్రవర్తనలో మార్పు రాలేదని మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అయితే రాహుల్ గాంధీ అభ్యర్ధన మేరకు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అలాగే పైకోర్టులో అప్పీల్ చేసేందుకు వీలుగా నెల రోజుల సమయం ఇచ్చింది.

ప్రజాప్రాతినిథ్య చట్టం ఏం చెబుతోంది:

అయితే ఏదైనా కేసులో దోషిగా తేలి , జైలు శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదు. దీనికి అనుగుణంగా లోక్‌సభ సచివాలయం రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. అంతేకాదు.. జైలు శిక్షతో పాటు మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సదరు నాయకుడు అనర్హుడవుతాడు. అలాగే ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే సదరు ప్రజాప్రతినిధిని అనర్హులుగా పరిగణించాలని 2013లోనే సుప్రీంకోర్ట్ స్పష్టం చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.