'లోకరక్షకుడి' ఈస్టర్ శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Saturday,April 15 2017]

చండ్రస్ ఆర్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్‌ చండ్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్‌ పార్లమెంట్‌లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఇంగ్లాండ్ లో రెండవ షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్రహ్మం సి.హెచ్‌. ఈ చిత్రానికి దర్శకుడు. ఆదివారం ఈస్టర్ పండగ సందర్భంగా చిత్ర యూనిట్ శుభాకాంక్షలను తెలియజేసింది.

ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్‌ చండ్ర మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జీవిత చరిత్రని అత్యద్భుతంగా, క్రొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నాము. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్‌ పూర్తయ్యాయి. మొదటి షెడ్యూల్‌ ఇండియాలోనూ, రెండవ షెడ్యూల్‌ ఇంగ్లండులోని పలు ప్రదేశాలలో చిత్రీకరించడం జరిగింది. 2017 క్రిస్టమస్‌ కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. ప్రపంచపటంలో అనాదిగా భారతదేశం శాంతి చిహ్నాము. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ తదితర మహానుభావులు ప్రపంచశాంతికి మార్గ దిశని చూపారు. అలాగే ఏసుక్రీస్తు జీవితం, మార్గం, సందేశం పలు వర్గాలలో, ప్రదేశాలలో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము..ఆదివారం ఈస్టర్ ని పురస్కరించుకుని..ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతున్నామని.. అన్నారు

దర్శకుడు బ్రహ్మం సి.హెచ్‌. మాట్లాడుతూ..ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా, ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాత సహకారంతో తెరకెక్కిస్తున్నాము. రాబోయే క్రిస్మస్ కి ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తాము. మార్చి 29న లండన్‌ పార్లమెంట్‌లో విడుదల చేసిన 'లోకరక్షకుడు' లోగో కి చాలా మంచి స్పందన వచ్చింది. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర పై ఇదో మంచి సినిమా అవుతుంది..అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె. రిసాల్‌ సాయి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జి. క్రిష్‌, రైటర్‌: డి. కృపాకర్‌, ఎడిటింగ్: నందమూరి హరి, సమర్పణ: చండ్ర పార్వతమ్మ, నిర్మాత: చంద్రశేఖర్‌ చండ్ర, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.హెచ్‌. బ్రహ్మం.

More News

రీమేక్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్....

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాను - లావణ్య త్రిపాఠి

వరుణ్తేజ్, లావణ్యత్రిపాఠి, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్పై శ్రీనువైట్ల దర్శకత్వంలో ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన చిత్రం `మిస్టర్`. ఏప్రిల్ 14న సినిమా విడుదలైంది.

'పూర్ణ' ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు నిర్మాత - దేవదాసు మోదుగు

డిఎస్ ఆర్ వి మీడియా పతాకంపై పివిఆర్ పిక్చర్స్ అసోషియేషన్ లో తెలంగాణ ముద్దుబిడ్డ పూర్ణ

మే నెలలో విడుదలకానున్న గోపీచంద్ 'ఆక్సిజన్'

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'

21 కి వాయిదా పడ్డ 'రిజర్వేషన్'

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. "డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్"తో