మెగాస్టార్ రెడీ.. ‘లూసిఫ‌ర్‌’కు డేట్ ఖ‌రారు..!

మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరంజీవి రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డైరెక్ష‌న్ రేసులో సుజిత్‌, వినాయ‌క్ వంటి వారి పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ రీమేక్‌ను మోహ‌న్‌రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఎప్ప‌టి నుంచో ఈ రీమేక్‌లో మెగాస్టార్ న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కానీ అంత కంటే ముందు స్టార్ట్ చేసిన ఆచార్య సినిమా పూర్త‌యిన త‌ర్వాతే ఈ రీమేక్‌ను స్టార్ట్ చేస్తారు. ప్ర‌స్తుతం ఆచార్య కోసం కోకాపేట‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. చిరంజీవిపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో చిరంజీవి పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. త‌ర్వాత షెడ్యూల్ చ‌ర‌ణ్‌పై ఉంటుంది కాబ‌ట్టి.. ఈలోపు చిరంజీవి ఖాళీగా ఉండ‌టం కంటే లూసిఫ‌ర్ రీమేక్‌ను స్టార్ట్ చేస్తే బావుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా జ‌న‌వ‌రి 18న లూసిఫ‌ర్ రీమేక్ షూటింగ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. సినిమాకు బైరెడ్డి అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. అలాగే చిరంజీవి పాత్ర‌కు హీరోయిన్ కూడా ఉండ‌ద‌ని టాక్ వినిపిస్తోంది. కీల‌క పాత్ర‌ల్లో స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార న‌టిస్తార‌ని కూడా స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ వార్త‌ల‌పై మ‌రింత క్లారిటీ రానుంది.

More News

డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’‌.. 

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో

యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

'సైకో వర్మ' సాంగ్ విడుదల

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ"  వీడు తేడా..టాగ్ లైన్ .

అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

డైరెక్టర్ క్రిష్‌కు కరోనా పాజిటివ్.. పవన్‌తో షూటింగ్ క్యాన్సిల్..

సినీ ప్రముఖులంతా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిందనగానే ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కాస్త రిలాక్స్ అయిపోయారు.