close
Choose your channels

సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. కరోనా పరీక్ష నిర్వహించగా..

Wednesday, August 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్.. కరోనా పరీక్ష నిర్వహించగా..

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కి నిర్వహించిన పరీక్షల్లో లంగ్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. లంగ్ క్యాన్సర్ ఆయనకు థర్డ్ స్టేజిలో ఉన్నట్టు సమాచారం. ఆగస్టు 8న ఆసుపత్రి పాలైనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. సంజయ్ దత్‌‌కు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.

తాజా నివేదికల ప్రకారం సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో సంజయ్ దత్ తన సోషల్ మీడియా ఖాతాలకు స్వల్ప విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన తన ఆరోగ్యంపైనే దృష్టి పెట్టినట్టు వెల్లడించారు. ‘‘హాయ్ ఫ్రెండ్స్, నేను వైద్య చికిత్స కోసం వర్క్ నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు ప్రస్తుతం నాతోనే ఉన్నారు. ఈ సమయంలో ఏవేవో పుకార్లు వైరల్ అవుతుంటాయని.. వాటిని నమ్మి ఆందోళన చెందవద్దని నా శ్రేయోభిలాషులను కోరుతున్నాను. మీ ప్రేమాభిమానాలతో నేను త్వరలోనే తిరిగి వస్తా’’ అని సంజయ్ దత్ వెల్లడించారు.

సంజయ్ దత్ తండ్రి, సునీల్ దత్ 2005లో గుండెపోటుకు గురయ్యారు. మరో 12 రోజుల్లో ఆయన తన 76వ పుట్టినరోజు జరుపుకుంటారనగా.. ఆయన భార్య నర్గీస్ దత్ మరణించారు. ఆ తరువాత సునీల్ దత్ న్యూయార్క్‌లో నర్గీస్ దత్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. సంజయ్ దత్ సోదరి ప్రియా దత్ ఈ ఫౌండేషన్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ అని తెలియడంతో ఆయన కోలకోవాలని కాంక్షిస్తూ సెలబ్రిటీలు, అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.