ప్రమాదంపై క‌మ‌ల్ హాస‌న్‌కు లైకా లేఖ‌

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. ఇటీవ‌ల ఈ సినిమా సెట్స్‌లో క్రేన్ యాక్సిడెంట్ జ‌రిగింది. ఇందులో సినిమాకు సంధించిన వ్య‌క్తిగ‌త స‌హాయ‌కులు మ‌ధు, సాయికృష్, చంద్ర‌న్ చనిపోయారు. ప‌ది మంది దాకా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంపై ట్విట్ట‌ర్ ద్వారా సానుభూతిని వ్యక్తం చేసిన క‌మ‌ల్‌హాస‌న్‌.. మృతుల కుటుంబాల‌ను చిత్ర నిర్మాత‌లు ఆదుకోవాల‌ని, షూటింగ్ స‌మ‌యాల్లో భ‌ద్ర‌త ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటేనే తాను షూటింగ్‌లో పాల్గొంటాన‌ని లేఖ ద్వారా క‌మ‌ల్ తెలిపారు. దీనికి ట్విట్ట‌ర్ ద్వారా లైకా ప్రొడ‌క్ష‌న్స్ స్పందించింది.

''షూటింగ్ స‌మ‌యంలో క్రేన్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్టం. బాధిత కుటుంబాల‌కు సంస్థ త‌ర‌పున రూ.2కోట్లు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించాం. గాయ‌ప‌డిన వాళ్ల‌కు చికిత్స అందిస్తున్నాం. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్ప‌టి నుండే చ‌ర్య‌లు చేప‌ట్టాం. ఈ విష‌యాలు మీకు తెలియ‌క పోవ‌డం వ‌ల్ల‌నే లేఖ రాశార‌ని భావిస్తున్నాం. షూటింగ్స్ స‌మ‌యంలో భ‌ద్ర‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ప్రొడ‌క్ష‌న్ భీమాతో పాటు వ్య‌క్తిగ‌త భీమాల‌ను కూడా స‌కాలంలో అందేలా చూస్తాం. మీకు కోరిన‌వ‌న్నీ ముందే చేశాం. షూటింగ్ తిరిగి ప్రారంభిస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నాం'' అన్నారు. 

More News

'రాహు' మెమరీస్ వెంటాడతాయి - హీరోయిన్ కృతి గార్గ్

విడుదలకు ముందే ఇండస్ట్రీ లో మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన సినిమా ‘రాహు’.  

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీ కథ ఇదేనా!?

‘బాహుబలి’లాంటి భారీ సినిమాతో వరల్డ్ ఫేమస్ అయిన ప్రభాస్.. ‘మహానటి’ సినిమా తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకున్న నాగ్ అశ్విన్ కాంబోలో

మార్చి 2 నుండి కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం

త‌న‌దైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో న‌టించి మెప్పించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా త‌న రెండ‌వ చిత్రం ఎలైట్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో

2024 కల్లా పవన్ టార్గెట్ రూ. 500 కోట్లు..!

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘పింక్’ రీమేక్ : ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.