విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ షాక్‌

  • IndiaGlitz, [Saturday,October 10 2020]

హీరో, నిర్మాత విశాల్‌కు మద్రాస్‌ హైకోర్ట్‌ శుక్రవారం పెద్ద షాకే ఇచ్చింది. వివరాల్లోకెళ్తే... విశాల్‌, సుందర్‌.సి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'యాక్షన్‌'.ఈ సినిమా విడుదల సమయంలో నిర్మాతలకు రూ8.29 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఆ సమయంలో నిర్మాణ సంస్థ ట్రైడెంట్‌ ఆర్ట్స్‌కు మరో సినిమా చేస్తానని చెప్పిన విశాల్‌ సినిమా చేయలేదు. దాంతో సదరు సంస్థ కోర్టులో కేసు వేసింది. తమకు విశాల్ ఇవ్వాల్సిన రూ.8.29కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్మాతలు కోరారు. కేసును పరిశీలించిన మ్రదాస్‌ హైకోర్టు యాక్షన్‌ సినిమా నష్టాలను విశాల్‌ భరించాల్సిందేనని తీర్పునిచ్చింది.

యాక్షన్‌ విడుదల సమయంలో సినిమా రూ.20 కోట్లు కలెక్ట్‌ చేస్తుందనే అగ్రిమెంట్‌పై విశాల్‌ సంతకం చేశారు. సినిమాకు రూ.44 కోట్ల బడ్జెట్‌ అయ్యింది. తీరా సినిమా విడుదలయ్యాక తమిళనాడులో 7.7కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో రూ.4కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో విశాల్‌ నష్టాలను భర్తీ చేయడానికి తన తదుపరి చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఆనంద్‌ దర్శకత్వంలో చేస్తానని మాటిచ్చారు. సినిమా చేయలేదు సరికదా.. చేసిన చక్ర సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అయ్యారు. దీనిపై ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ సంస్థ తమకు విశాల్‌ ఇవ్వాల్సిన రూ.8.29 కోట్లు చెల్లించే వరకు 'చక్ర' సినిమా విడుదలను ఆపాలంటూ కేసు వేసింది.

More News

సూసైడ్ చేసుకోవాలనుకున్నానన్న అవినాష్.. మోనాల్‌పై నమ్మకం లేదన్న అఖిల్

ఇవాళ షో మొత్తాన్ని అవినాష్ కంప్లీట్‌గా హ్యాండోవర్ చేసుకున్నాడు. ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్‌కే దక్కింది. చూసే వాళ్లకే కాదు.. కంటెస్టెంట్లలో కూడా మంచి జోష్‌ని నింపాడు. ఇక షో విషయానికి వస్తే..

అన్‌లాక్ 5.0 నిబంధనలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

కేంద్రం జారీ చేసిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

రాఘవేంద్రుడి 'పెళ్లి సందడి' మళ్లీ మొదలు కాబోతోంది

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అద్భుత సృష్టి ‘పెళ్లి సందడి’ గుర్తుంది కదా.. 1996లో శ్రీకాంత్ హీరోగా రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

అల్లు అర్జున్, రానాలు నా ప్రయాణాన్ని అద్భుతం చేశారు: అనుష్క

లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో అనుష్క దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 'అరుంధతి'తో మొదలైన అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీస్ ప్రయాణం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తెలుగుతో పాటు హిందీ ప్రేక్షకుల నుంచీ 'ఎక్స్‌పైరీ డేట్‌'కి మంచి స్పందన లభిస్తోంది! - మధు షాలిని

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ఎక్స్‌పైరీ డేట్'‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్