మహాభారత్‌లో ‘భీముడు’ ప్రవీణ్ కుమార్ ఇక లేరు

  • IndiaGlitz, [Tuesday,February 08 2022]

ఓ 30 ఏళ్లు వెనక్కి వెళితే.. అప్పుడప్పుడే భారత్‌లో టీవీలు రంగ ప్రవేశం చేస్తున్న కాలం. దూరదర్శన్ తప్పించి మరో ఛానెల్ లేని సమయం. ఆ సమయంలో భారతీయులకు వినోదాన్ని పంచిన ధారావాహిక.. ‘‘మహాభారతం’’. బీఆర్ చోప్రా నిర్మించిన ఈ సీరియల్ 1988 నుంచి 1990 మధ్య యావత్ దేశాన్ని అలరించింది. ఇంటిల్లిపాదితో పాటు చుట్టుపక్కల వారు టీవీ సెట్ల ముందు కూర్చొని భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. ఈ సీరియల్‌లో నటించిన వారు అప్పట్లో బాగా ఫేమస్. ఆ పాపులారిటీతోనే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ‘‘మహాభారత్‌’’లో భీముడి పాత్రతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రవీణ్ కుమార్ సోబ్తీ ఇక లేరు. గుండెపోటుతో సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రవీణ్ కుమార్తె నికునికా మీడియాకు తెలిపారు.

ప్రవీణ్ .. ఆహార్యం, హైట్‌ నిజంగా భీముడు అంటే ఇలాగే ఉంటాడా అన్న భావన ప్రేక్షకుల్లో కలిగించింది. మహాభారత్‌తో పాటు బాలీవుడ్‌లో 50 కిపైగా చిత్రాల్లో నటించారు. 1990లో కమల్‌హాసన్‌ నటించిన ‘మైఖెల్‌ మదన్‌ కామరాజు’ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కూడా పలకరించారు ప్రవీణ్‌. పంజాబ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ సోబ్తీ.. కేవలం నటుడు మాత్రమే కాదు.. హ్యామర్, డిస్క్‌త్రో‌లో కూడా ఛాంపియన్. ఆయన హాంకాంగ్‌లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో భారత్ తరపున పాల్గొని పలు పతకాలను సాధించారు. అంతేకాకుండా ఒలింపిక్స్‌లోనూ దేశానికి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు ప్రవీణ్ కుమార్.

క్రీడలు, సినిమాలు, సీరియల్స్‌కే పరిమితం కాకుండా ఆయన రాజకీయాల్లోనూ ప్రవేశించారు. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

More News

‘‘ క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో’’ : ఎఫ్ 3 మూవీ నుంచి 'లబ్‌ డబ్‌ ' సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా.

అసద్‌జీ.. ‘‘జడ్’’ కేటగిరీ సెక్యూరిటీ తీసుకోండి:  ఒవైసీని కోరిన అమిత్ షా

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

‘జనగణమన’ ఆ హీరోతోనే.. క్లారిటీ ఇచ్చేసిన పూరి, తన గొంతుతోనే చెప్పేశాడుగా

‘‘ జనగణమన’’.. దర్శకుడు పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులలో ఒకరితో ఈ సినిమాను పట్టాలెక్కించాలన్నది పూరి   ప్లాన్.

పార్టీ మారతారంటూ వార్తలు.. ప్రాణం వున్నంత వరకు జగన్‌తోనే అన్న రోజా

ఆర్కే రోజా... హీరోయిన్‌గా దక్షిణాదిలో ఓ వెలుగు వెలిగిన ఈ భామ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది.

కొంపముంచిన ప్రమోషన్ వీడియో... చిక్కుల్లో బిగ్‌‌బాస్ ‘‘సరయూ’’

యూట్యూబ్ స్టార్ 7ఆర్ట్స్‌ సరయు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.