'మహానటి' వెనక్కి వెళుతుందా!

  • IndiaGlitz, [Thursday,January 25 2018]

మ‌హాన‌టి సావిత్రి జీవితం ఆధారంగా 'మ‌హాన‌టి' సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. టైటిల్ రోల్‌లో కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్ న‌టిస్తోంది. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 29న విడుద‌ల చేస్తార‌ని తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయ‌ట‌. ముఖ్యంగా సీజీ వ‌ర్క్ చాలా చేయాల్సి ఉంద‌ట‌. అవ‌న్నీ పూర్తి చేస్తే కానీ సినిమాకు ప‌రిపూర్ణ‌త చేకూర‌దు. కాబ‌ట్టి సినిమాకు సంబంధించిన ప‌నుల‌ను పూర్తి చేసి వేసవిలో విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో ఎస్వీఆర్‌గా మోహ‌న్‌బాబు న‌టిస్తుండగా.. స‌మంత‌, షాలినీ పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్, ప్ర‌కాష్ రాజ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమాలో మాయాబ‌జార్ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాలు ఉంటాయ‌ట‌. ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు అయిన‌ కె.వి.రెడ్డి పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ న‌టిస్తుండ‌గా.. కె.వి.రెడ్డి అసిస్టెంట్ అయిన మ‌రో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు పాత్ర‌లో పెళ్లి చూపులుకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ త‌రుణ్ భాస్క‌ర్ క‌నిపించ‌నున్నార‌ని తెలిసింది.

More News

సమంత ఫేవరేట్ ప్రాజెక్ట్.. ఫిబ్రవరి నుంచి

సమంత ఫేవరెట్ ప్రాజెక్ట్'యు-టర్న్'మూవీ ఎట్టకేలకు పట్టాలెక్కనుంది.

అఖిల్ తో ఆర్జీవీ

సీనియర్ కథానాయకుడు అక్కినేని నాగార్జునకి ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో..‘శివ’

అనిరుధ్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే..

రానాకి కథ చెప్పిన సీనియర్ డైరెక్టర్

‘బాహుబలి’సిరీస్ ఇచ్చిన విజయంతో వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలు ఎంచుకుంటున్నాడు యంగ్ హీరో దగ్గుబాటి రానా.

కణం వాయిదా పడిందా?

ఫిదా చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మలర్ బ్యూటీ సాయిపల్లవి..