కండీషన్స్ పెట్టిన 'మహర్షి' నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్ హీరోగా నటిస్తున్న 'మహర్షి' చిత్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు షూటింగ్ జరుగుతుంటే, మరోవైపు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వనీదత్, దిల్రాజు, పీవీపీ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయిక. నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. లెటెస్ట్ సమాచారం ప్రకారం నిర్మాతలు అమెజాన్కు కండీషన్ పెట్టారట.
సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత డిజిటల్ మాధ్యమంలో సినిమాను ప్రసారం చేయాలనేదే ఆ కండీషన్. ఒకప్పుడు 30 రోజుల తర్వాత ప్రసారం చేయాలనే కండీషన్ను పక్కన పెట్టి కొత్త కండీషన్ పెట్టారట నిర్మాతలు. దానికి అమెజాన్ సంస్థ కూడా ఒకే చెప్పిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.