close
Choose your channels

మ‌హేష్ 25 దీపావ‌ళికి రానుందా?

Friday, December 29, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్ స్టార్ మహేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌ 24వ చిత్రం 'భరత్ అనే నేను'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో కైరా అద్వాని కథానాయికగా న‌టిస్తోంది.

శ్రీ‌మంతుడు వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత కొర‌టాల‌, మ‌హేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో.. ఈ చిత్రం కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే...దీని తర్వాత మహేష్ త‌న‌ 25వ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయ‌నున్న‌ సంగతి తెలిసిందే.

వచ్చే ఫిబ్రవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. కథానుగుణంగా ఈ మూవీని న్యూయార్క్ లో ఎక్కువ భాగం చిత్రీకరించాల్సి ఉంది. అందుకే చిత్ర బృందం కూడా లొకేషన్స్ వేటలో పడ్డారు. అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని 2018 దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.