మహేష్ అదనంగా కేటాయిస్తున్నాడు...

  • IndiaGlitz, [Saturday,July 08 2017]

ప్ర‌స్తుతం స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్' షూటింగ్‌లో మ‌హేష్ బిజి బిజీగా ఉన్నాడు. సినిమా రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ‌నంతా పూర్తి చేసుకుంది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు కూడా మ‌రో వైపు జ‌రుగుతున్నాయి. ఈ నెల‌లో ఈ రెండు సాంగ్స్‌ను యూనిట్ పూర్తి చేయాల‌ని భావిస్తోంది.
ఈ రెండు సాంగ్స్‌ను తెలుగు, త‌మిళంలో వేర్వేరుగా షూట్ చేయాల‌ని యూనిట్ ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. అందుకోసం మ‌హేష్ కూడా అద‌న‌పు స‌మ‌యాన్ని కేటాయిస్తున్నాడ‌ని స‌మాచారం. ఎ.ఆర్‌.మురుగదాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 21న విడుదల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య‌, భ‌ర‌త్ విలన్స్‌గా న‌టిస్తున్నారు.