మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్స్‌లో డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Friday,March 02 2018]

'ఒక లైలా కోసం'(2014), 'ముకుంద'(2014), 'దువ్వాడ జగన్నాథ‌మ్' (2017) .. ఇలా ఇప్ప‌టివ‌ర‌కు మూడు తెలుగు సినిమాల్లో నటించినా.. చెప్పుకోదగ్గ విజయాన్నైతే తన ఖాతాలో వేసుకోలేదు ఉత్త‌రాది పూజా హెగ్డే. కాని ఈ మూడు చిత్రాల విష‌యంలో ఓ అరుదైన ఘనతను మాత్రం దక్కించుకుంది ఈ భామ.

అదేమిటంటే.. ఈ మూడు చిత్రాలు కూడా మూడు మతాలకు సంబంధించిన పండుగలను టార్గెట్ చేస్తూ విడుదల అయిన‌వి కావ‌డం విశేషం. తొలి రెండు చిత్రాలు దీపావళి, క్రిస్మస్ పండుగల సందర్భంగా విడుదలైతే.. ఇక 'దువ్వాడ జగన్నాథ‌మ్‌' రంజాన్ సందర్భంగా విడుదలైంది. అంతేగాకుండా.. త్వ‌ర‌లో ఈ ముద్దుగుమ్మ చేయ‌నున్న‌ ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల చిత్రాలు కూడా ఒకే పండ‌గ టైమ్‌లో రాబోతున్నాయి.

కాస్త‌ వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది. దీంతో పాటు.. వంశీ పైడిపల్లి రూపొందించబోతున్న మహేష్ బాబు 25వ చిత్రంలో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది ఈ డీ.జే. భామ. ఈ రెండు చిత్రాలు కూడా 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయ‌ని స‌మాచారం.

అంటే ఇంతవరకు మూడు విభిన్న మ‌తాల‌ పండగల స‌మ‌యంలో సందడి చేసిన పూజా.. తొలిసారి సంక్రాంతి బరిలో డబుల్ ధమాకా ఇవ్వబోతోందన్న మాట. అది కూడా మ‌హేష్‌, ఎన్టీఆర్ వంటి టాప్ హీరోల‌తో కావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. పూజా ప్ర‌త్యేక గీతం చేసిన 'రంగ‌స్థ‌లం' ఈ నెల‌లోనే విడుద‌ల కానుండ‌గా.. 'సాక్ష్యం' చిత్రం మే 18న విడుద‌ల కానుంది.

More News

సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌న్ ఫిల్మ్ ఎప్పుడంటే..

20 ఏళ్ల క్రితం విడుద‌లైన తొలి ప్రేమ చిత్రంతో.. ప్రేమ‌క‌థా చిత్రాల ప‌రంగా ఓ ట్రెండ్ సృష్టించారు ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్. జ‌యాప‌జ‌యాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌న ప్ర‌తి చిత్రంతోనూ కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్.

తక్కువ గ్యాప్ లో నాలుగు చిత్రాలతో..

పెళ్ళిచూపులు చిత్రంతో సోలో హీరోగా తొలి హిట్ ను అందుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ..

ఎన్టీఆర్ లాగే త్రివిక్ర‌మ్ కూడా హిట్ కొడ‌తాడా?

తెలుగు వారికి ఇష్టమైన పండగ అంటే.. అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ పండగ స‌మ‌యంలో విజయం సాధిస్తే ఏడాదంతా విజయలక్ష్మి వారితో ఉంటుందని నమ్మకం.

త్రివిక్ర‌మ్ ఖాతాలో మ‌రో యంగ్ హీరో

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి విజ‌యాల‌ను అందుకున్న మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. ప్ర‌స్తుతం మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంది.

మార్చి 5న 'కణం' ప్రీ రిలీజ్ ఫంక్షన్

'ఛలో'తో సూపర్హిట్ కొట్టిన నాగశౌర్య,'ఫిదా','ఎంసిఎ'వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్.వి.ఆర్.సినిమా సమర్పణలో