close
Choose your channels

బ్రాండ్ అంబాసిడర్‌గా దూసుకెళ్తోన్న మహేశ్ బాబు.. సూపర్‌స్టార్ ఖాతాలోకి ‘‘మౌంటెన్ డ్యూ’’

Friday, December 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. గ్రీకు రాకుమారుడిలా కనిపించే ఆయనంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడతారు. ఇక అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు కాబోయే భర్త.. అచ్చం మహేశ్ లాగే వుండాలని కలలు కంటూ వుంటారు. వరుస బ్లాక్ బస్టర్లలతో తిరుగులేని స్టార్‌గా ఎదిగిన మహేశ్.. సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలోనూ పాల్గొంటున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ స్టార్స్‌తో పోటీపడే ఒకే ఒక్క దక్షిణాది నటుడు మహేశ్ మాత్రమే. ఇప్పటికే పలు బ్రాండ్స్‌కి ప్రచార కర్తగా వ్యవహరిస్తోన్న మహేశ్ బాబు.. తాజాగా ప్రముఖ శీతలపానీయాల బ్రాండ్ 'మౌంటెన్ డ్యూ' డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఇద్దరి మధ్యా ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన బహుళజాతి శీతలపానీయాల సంస్థ పెప్సీ‌కో ఉత్పాదనల్లో మౌంటెన్ డ్యూ డ్రింక్ కూడా ఒకటి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ‘‘సర్కారు వారి పాట’’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.