close
Choose your channels

‘ఎవరు’ ని అభినందించిన మహేశ్

Sunday, August 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఎవరు’ ని అభినందించిన మహేశ్

మంచి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ప్రశంసలు లభిస్తాయి. ఆగస్ట్ 15న విడులైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ‘ఎవరు’ సినిమా ప్రేక్షకులు ప్రశంసలు అందుకుంది. పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి సినిమా చాలా బావుందని అప్రిషియేట్ చేశారు. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంటైర్ యూనిట్‌ని అబినందించిన సంగతి తెలిసిందే. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ కూడా ఆ జాబితాలో చేరారు. ‘ఎవరు’ సినిమాను ట్విట్టర్ వేదికగా అభినందించారు.

‘‘‘ఎవరు’ సినిమా చూసి థ్రిల్ అయ్యాను. గొప్ప స్క్రీన్‌ప్లేతో రూపొందిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. అద్భుతంగా సినిమాను ఎగ్జ్‌క్యూట్ చేశారు. సినిమా విజయంలో భాగమైన అడివిశేష్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు’’ అని అన్నారు మహేశ్. దీనికి అడివిశేష్ ట్విట్టర్ ద్వారా ‘‘ఆన్ స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ సినిమా ప్రోత్సహిస్తున్న సూపర్‌స్టార్ మహేశ్‌కి థ్యాంక్స్. ‘మేజర్’ చిత్రంతో మీమ్మల్ని గర్వపడేలా చేస్తానని భావిస్తున్నాను’’ మహేశ్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎవరు’. వెంకట్ రామ్‌జీ దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్‌పై సినిమా రూపొందింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రానికి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు. ‘క్షణం’ తర్వాత పివిపి సినిమా, అడివిశేష్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమిది.

అలాగే అడివిశేష్ ఇప్పుడు మహేశ్ బ్యానర్‌లో ‘మేజర్’ సినిమాను చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాపై సెట్స్ పైకి వెళ్లనుంది. 26/11 దాడుల్లో ప్రాణాలు అర్పించి ప్రజలను కాపాడిన కమెండో ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.