Mahesh Babu: ఇక నుంచి మీరే అమ్మ, నాన్న.. 'మావా ఎంతైనా' అంటున్న మహేష్..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

మరో రెండు రోజుల్లో 'గుంటూరు కారం' సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా యూనిట్ ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తోంది. మంగళవారం రాత్రి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మహేష్ బాబు సొంత జిల్లా గుంటూరులో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. అలాగే చిత్ర బృందం అంతా పాల్గొన్నారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం మహేష్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్‌ నింపింది.

ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి మా సినిమాలు బ్లాక్‌బాస్టర్ అయ్యాయి. ఈసారి కూడా గట్టిగా కొడుతున్నాం. అయితే ఈసారి నాన్న లేని లోటు మాత్రం ఉంది. ఇక నుంచి అభిమానులే నాకు అమ్మ, నాన్న.. ఏదైనా ఇక మీరే అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో నటన విషయంలో మహేష్‌ను కొట్టేవారు లేరని చెప్పడం ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షలకును మెప్పించగా.. తాజాగా చడీచప్పుడు లేకుండా 'మావా ఎంతైనా' అంటూ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇందులో మహేష్.. కుటుంబం గురించి ఎమోషన్ అవుతున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. అలాగే ఈ పాటలోనూ మహేష్ డ్యాన్స్ ఇరగదీశాడు. ఇప్పటిదాకా పాటల్లో శ్రీలీల మాత్రమే కనిపించగా.. ఈ పాటలో మాత్రం మీనాక్షి చౌదరిని చూపించారు.

మొత్తానికి ఈ సినిమా ట్రైలర్, పాటలు చూస్తుంటే అభిమానులకు ఫుల్ మీల్స్ అందించేలా ఉంది. మహేష్ చెప్పినట్లుగా ఈసారి సంక్రాంతి పండుగకు కూడా గట్టిగా కొట్టేలా ఉన్నారు. మరి ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియాలంటే ఈనెల 12వరకు ఆగాల్సిందే.

More News

Film Chamber: సంక్రాంతి సినిమాల వివాదం.. మీడియాకు ఫిల్మ్‌ ఛాంబర్ వార్నింగ్..

ఈసారి సంక్రాంతికి సినిమాల విడుదల విషయంలో గతంలో ఎన్నడూ లేని వివాదాలు తలెత్తుతున్నాయి. ఈసారి పోటీ విపరీతంగా ఉండటంతో హనుమాన్ సినిమాకు థియేటర్ల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిదంటూ జోరుగా

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'గుంటూరు కారం' బెనిఫిట్ షోకు గ్రీన్ సిగ్నల్..

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన "గుంటూరు కారం'సినిమా. సంక్రాంతి పండుగ కానుకగా ఈనెల 12 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

YSRCP MP Candidates: వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. పలువురు సిట్టింగ్‌లకు షాక్..!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల కేటాయింపుపై పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను

AP Politics: పార్టీలు మారిన నేతలపై పోటాపోటీ ఫిర్యాదులు.. రసవత్తరంగా ఏపీ రాజకీయాలు..

ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు రంజుగా మారుతోంది. ఎప్పుడూ ఏ పార్టీ నుంచి ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఊహించడం కష్టమవుతోంది. మరో రెండు నెలల్లో జరగనున్న

Vijayasai Reddy: ఏపీ, తెలంగాణ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: విజయసాయి రెడ్డి

ఏపీతో పాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల బృందాన్ని అభ్యర్థించారు. విజయవాడలో సీఈసీ బృందం