మ‌హేష్‌... లైట్‌గా పెంచుతున్నాడుగా!

  • IndiaGlitz, [Tuesday,June 18 2019]

మ‌హేష్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. ఈ మ‌ధ్య‌నే ఫ్యామిలీతో సెకండ్ ట్రిప్‌కి కూడా వెళ్లొచ్చాడు. కెరీర్‌లో 25వ సినిమా భారీ హిట్ సాధించినందుకు అత‌నికి మామూలు ఆనందంగా లేదు. అదే ఆనందంతో అత‌ను అనిల్ రావిపూడి సెట్స్ కు వెళ్ల‌నున్నారు. అయితే మ‌హేష్ ఈ మ‌ధ్య కాస్త ఒళ్లు చేసిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని, అది కూడా ఫిట్‌నెస్ వ‌ల్ల క‌నిపించే కండ‌ల‌ని స‌న్నిహితుల స‌మాచారం. ఎప్పుడూ ఫిజిక్ ప‌రంగా పెద్దగా మార్పులు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని మ‌హేష్‌కి 'మ‌హ‌ర్షి' కాస్త కాన్ఫిడెన్స్ తెచ్చిపెట్టింది.

లుక్కులు, గెట‌ప్పులు ప‌ర్ఫెక్ట్ గా స‌రిపోయేట‌ట్టు వేసుకుంటే త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం వ‌చ్చేసింది. అందుకే తాజాగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే స‌రిలేరు నీకెవ్వ‌రూలో ఆయ‌న మీసాల‌ను తిప్ప‌బోతున్నార‌ట‌. దానికి తోడు మిలిట‌రీ క‌టింగ్ కొట్టించుకోనున్నార‌ట‌. లైట్‌గా కండ‌లు క‌నిపించేలా టైట్ బ‌ట్ట‌లు వేసుకోనున్నార‌ట‌. మిలిట‌రీ నుంచి తిరిగి వ‌చ్చిన రాయ‌ల‌సీమ వాసిగా ఆయ‌న ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. పూర్తి స్థాయి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్ర‌మిది.