మహేష్ , కొరటాల శివ వెనక్కివెళ్లిందా?

  • IndiaGlitz, [Tuesday,February 21 2017]

సూప‌ర్‌స్టార్ మహేష్‌, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో నిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో మ‌హేష్‌, కొర‌టాల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సెన్సెష‌న‌ల్ హిట్ అయ్యింది. ఈ హిట్ కాంబినేష‌న్ రిపీట్ అవుతున్న సినిమా అన‌గానే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌గా రూపొందుతోన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడో మొద‌లు కావాల్సింది కానీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది.
ఈ సినిమాకు భ‌ర‌త్ అను నేను అనే టైటిల్‌ను కూడా రిజిష్ట‌ర్ చేయించారు. ఈ సినిమాను ముందుగా సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేద్దామ‌ని యూనిట్ స‌భ్యులు అనుకున్నారు. అయితే షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో సినిమాను ఈ ఏడాది చివ‌ర్లో కానీ లేదా, వ‌చ్చే ఏడాది సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాల‌ని నిర్మాత భావిస్తున్నార‌ని స‌మాచారం. మ‌రి దీనిపై శివ కానీ అత‌ని టీం కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

More News

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సెన్సార్ పూర్తి...మార్చి 3న విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్

'ఘాజీ' పై అగ్ర దర్శకుల ప్రశంసలు

జలాంతర్గామి నేపధ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పేరు తెచ్చుకొన్న "ఘాజీ" అశేష అభిమానాన్ని చూరగొంది. ఇప్పుడు "ఘాజీ" చిత్రంపై తెలుగు చిత్రసీమకు చెందిన అగ్ర దర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రజనీకాంత్ సినిమాలో విద్యాబాలన్....?

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

అభిమాని కోసం...

అభిమానం అనే దానికి హద్దులు ఉండవు.ఇలాంటి అభిమానానికి కట్టుబడింది హీరోయిన్ తాప్సీ..

రేడియో సిటీ లో 'తొలి పరిచయం' తొలి పాట విడుదల

పియుకే ప్రొడక్షన్స్ పతాకంపై వెంకీ,లాస్య జంటగా ఎల్.రాధాకృష్ణను దర్శకుడుగా పరిచయం చేస్తూ దీపక్ కృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘తొలి పరిచయం’.