అప్పుడు మ‌హేష్ త‌ల్లి.. ఇప్పుడు అనుప‌మ త‌ల్లి

  • IndiaGlitz, [Friday,May 25 2018]

'మిస్ట‌ర్ పెళ్ళాం, శుభ‌ల‌గ్నం, శుభ సంక‌ల్పం, మావిచిగురు' త‌దిత‌ర చిత్రాల‌తో అల‌రించిన‌ నిన్నటితరం కథానాయిక ఆమని. ఇటీవల విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్‌ బాబుకి తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రామిస్‌కి ఉండే గొప్పతనం గురించి కొడుకుకి అర్ధమయ్యేలా చెప్పే సీన్‌లో త‌న మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇదిలా ఉంటే ‘భరత్ అనే నేను’లో హీరో తల్లి పాత్రలో కనిపించిన ఆమని.. తన అప్ కమింగ్ మూవీలో హీరోయిన్‌కి తల్లి పాత్రలో నటించనున్నార‌ని స‌మాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు నిర్మాణంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్, కేర‌ళ కుట్టి అనుపమ జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అనుపమకి తల్లిగా ఆమని కనిపించనుండగా.. తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ న‌టిస్తున్నారు. ఇక రామ్‌కు తండ్రిగా రావు రమేష్ నటిస్తున్నారు. అయితే ‘భరత్ అనే నేను’లో తల్లిగా ఈ పాత్ర చెప్పిన మాట చుట్టూ కథ తిరుగుతుంది. అదే ఆ సినిమా విజయానికి దోహదపడింది. మరి ఈ సినిమాలో ఆమని పాత్రను దర్శకుడు ఎలా తీర్చిదిద్దనున్నారో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

More News

త‌మ‌న్నా.. వ‌రుస‌గా మూడో ఏడాది

తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సులకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో వేరేగా చెప్పనక్కరలేదు.

జూన్ 22న 'టిక్ టిక్ టిక్'

బిచ్చగాడు, 16 చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాతగా చదలవాడ బ్రదర్స్ టాలీవుడ్ లొ ప్రత్యేక గుర్తింపు ను సంపాందించారు.

జూన్ 1న విడుద‌ల‌వుతోన్న 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి'

సీనియ‌ర్ న‌టుడు ర‌హ‌మాన్ న‌టించిన చిత్రం 'ఒరు ముగ తిరై'. సెంథిలీ నాథన్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్ బ్యాన‌ర్‌పై డి.వెంక‌టేశ్ తెలుగులో 'డాక్ట‌ర్ స‌త్య‌మూర్తి' పేరుతో విడుద‌ల చేస్తున్నారు.

'అమ్మ‌మ్మ‌గారిల్లు' ప్రీ రిలీజ్ వేడుక‌

శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ స‌హ నిర్మాత‌గా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం 'అమ్మమ్మగారిల్లు'.

జూన్ 1న రాజ్ తరుణ్ 'రాజు గాడు' విడుదల

యంగ్ హీరో రాజ్ తరుణ్ 'రాజుగాడు' చిత్రం జూన్1న విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన పాటలకు మరియు చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.