ఆరు దేశాల్లో మహేష్ మూవీ..

  • IndiaGlitz, [Friday,July 14 2017]

ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాహుబలి2' చిత్రంలో గ్రాఫిక్స్‌ ఎంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయో తెలిసిందే. భారీ సినిమాలకు మంచి కథ, కథనాలు, మంచి ఆర్టిస్టులు ఎంత అవసరమో గ్రాఫిక్స్‌ కూడా అంతే అవసరం అన్నట్టుగా మారాయి పరిస్థితులు. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలకు అన్ని హంగులతోపాటు గ్రాఫిక్స్‌ కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పుడు మహేష్‌ హీరోగా ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్న 'స్పైడర్‌' చిత్రంలో గ్రాఫిక్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇచ్చాడు మురుగదాస్‌. బాహుబలి రిలీజ్‌ తర్వాత వాటి అవసరం మరింత పెరిగింది. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది.

అందులో భాగంగా గ్రాఫిక్‌ వర్క్‌ ఏకకాలంలో ఆరు దేశాల్లో చేయిస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యాలంటే గ్రాఫిక్‌ వర్క్‌ని స్పీడప్‌ చెయ్యాలి. అందుకే మురుగదాస్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇండియా, రష్యా, ఇరాన్‌, బ్రిటన్‌ వంటి దేశాల్లో 'స్పైడర్‌' వర్క్‌ జరుగుతోంది. ఒక పాట చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వచ్చే నెల బ్యాలెన్స్‌ సాంగ్‌ తీస్తారట. ప్రస్తుతం వున్న పరిస్థితులు చూస్తుంటే గ్రాఫిక్‌ వర్క్‌ త్వరగా పూర్తి చేస్తే గానీ 'స్పైడర్‌' దసరా బరిలోకి దిగే అవకాశం లేదు. అందుకే గ్రాఫిక్‌ వర్క్‌ మొత్తం తన పర్యవేక్షణలోనే జరుపుతున్నాడు మురుగదాస్‌.

More News

కపిల్ దేవ్ జీవిత చరిత్రలో ఎవరు?

ఇండియాకు తొలిసారి వరల్డ్ కప్ తెచ్చి పెట్టిన స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్.

బిగ్ బాస్ లో జబర్ దస్త్ కమెడియన్

టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇప్పుడు బుల్లితెర వైపు అడుగులేస్తున్నారు.

ఉయ్యాలవాడతో ఉపేంద్ర

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆగష్టులో జీవీ ప్రకాష్ - యశ్వంత్ మూవీస్ 'బ్రూస్ లీ'

మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటించిన తమిళ చిత్రం 'బ్రూస్ లీ'

విడుదలైన ఏంజెల్ తమిళ వెర్షన్ ఆడియో

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగాఅన్వేష్,హెబ్బాపటేల్ జంటగా నటించిన చిత్రం 'ఏంజెల్'.