మహేష్ సినిమా సీక్వెల్ కథాంశమా?
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్స్టార్ మహేష్ `మహర్షి`గా ఏప్రిల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాడు. అశ్వనీదత్, దిల్రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. మహేష్ హీరోగా నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమాలో మహేష్ కోటీశ్వరుడిగా, ఓ పెద్ద కంపెనీకి అధినేతగా కనిపిస్తారు.
అలాంటి వ్యక్తి ఇండియా వచ్చి ఓ గ్రామానికి వెళ్లి అక్కడి సమస్యలను ఎందుకు తీర్చాడనేదే `మహర్షి` సబ్జెక్ట్ అని.. మహేష్ సూపర్హిట్ చిత్రం `శ్రీమంతుడు`కి ఇది సీక్వెల్ అని సినీ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. అల్లరి నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయాలనకున్నారు. కానీ అనుకున్న తేదీన కాకుండా కాస్త ఆలస్యంగా అంటే ఏప్రిల్ నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.