మరోసారి అదే డైరెక్టర్ తో మహేష్ బాబు

  • IndiaGlitz, [Friday,October 18 2019]

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో సినిమాలు చేయాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. అయితే మ‌హేశ్‌కి మాత్రం న‌చ్చిన ద‌ర్శ‌కులు కొంత మందే. రీసెంట్ టైమ్‌లో మ‌హేశ్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వెంట వెంట‌నే సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు హిట్ అయ్యాయి. కొరటాల‌తో మ‌హేశ్ వ‌రుస సినిమాలు చేయ‌డానికి కార‌ణం.. మ‌హేశ్‌కు త‌గ్గ‌ట్టు కొరటాల సినిమాలు చేయ‌డ‌మే. ఇప్పుడు అలాంటి మ‌రో ద‌ర్శ‌కుడు మ‌హేశ్‌కి బాగా న‌చ్చేశాడు. ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. అనీల్ రావిపూడి. 

ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం 'స‌రిలేరు నీకెవ్వ‌రు'.  సినిమా సెట్స్‌లో ప‌రిస్థితుల‌ను అనీల్ హ్యాండిల్ చేసిన తీరు బాగా న‌చ్చ‌డంతో మహేశ్ మ‌రోసారి అది కూడా వెంట‌నే అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే ఇది అధికారికంగా తెలియ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది.

ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా తెర‌కెక్కుతోన్న 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమాను అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మ‌హేశ్ నిర్మిస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విజ‌య‌శాంతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. 

More News

రామ్ ‘డబుల్’ ప్రయత్నం ఫలించేనా!?

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఊహించని హిట్టవ్వడంతో కుర్ర హీరో రామ్ మంచి ఊపు మీదున్నాడు.

ఆర్టీసీ కార్మికుల విషయంపై ఫస్ట్ టైమ్ తమిళిసై స్పందన

తెలంగాణలో గత రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అయితే కార్మికుల డిమాండ్‌కు సీఎం కేసీఆర్ అస్సలు ఒప్పుకోకపోవడం..

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా.. కేసీఆర్ శాశ్వతం కాదు!

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వినర్‌ అశ్వద్ధామరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

జగన్‌ పాలన చూసి ఓర్వలేక ఈ దుశ్చర్య!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు అండ, ఆర్థికబలంతో నడిచే పత్రికలు,

ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సర్కార్‌పై హైకోర్ట్ సీరియస్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు రెండు వారాలుగా సమ్మెకు దిగిన తెలిసిందే. తమ డిమాండ్స్ నెరవేర్చాల్సిందేనని కార్మికులు..