అదే రోజున ప్లాన్ చేసుకున్న మ‌హేశ్‌?

  • IndiaGlitz, [Tuesday,March 24 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ సినిమాకి రంగం సిద్ధ‌మ‌వుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా, మ‌హేశ్‌కి క‌థ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆగిపోయింది. వంశీ పైడిప‌ల్లి స్థానంలో ప‌రుశురామ్ చేరాడు. క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. కాబ‌ట్టి ప‌రుశురామ్‌కు కావాల్సినంత టైమ్ దొరికింది. స్క్రిప్ట్‌ను మరింతగా మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డాడీ ద‌ర్శ‌కుడు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 31న సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసి జూలైలో రెగ్యుల‌ర్ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ‌ర్మ్‌లో ఏప్రిల్ 28న విడుద‌ల చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇదే రోజున 14 ఏళ్ల క్రితం అంటే 2006లో మ‌హేశ్ కెరీర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచి, మ‌హేశ్‌ని సూప‌ర్‌స్టార్‌గా నిల‌బెట్టిన పోకిరి చిత్రం విడుద‌లైంది. అదే రోజున త‌న 27వ సినిమాను మ‌హేశ్ విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. ఈ ఏడాది స‌రిలేరు నీకెవ్వ‌రుతో స‌క్సెస్ అందుకున్న మ‌హేశ్‌.. చిరంజీవి ఆచార్య‌లో న‌టించాల్సింది కానీ కుద‌ర‌లేదు. మ‌హేశ్ భారీ రెమ్యున‌రేష‌న్ కార‌ణంగా మెగా క్యాంప్ నోరు మెద‌ప‌లేదు. మ‌హేశ్ స్థానంలో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడు మ‌రి.

More News

RRR: ఉగాది ట్రీట్‌గా టైటిల్

ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇప్పటికే భారీ చిత్రాలతో ఇండియన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టిన జక్కన్న మరోసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకునే దిశగా

క‌రోనా ప్ర‌భావం... క‌త్రినా అలా! కాజ‌ల్ ఇలా

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినీ రంగం అంతా స్త‌బ్ద‌త నెల‌కొంది. షూటింగ్స్ బంద్ అయ్యాయి. సినీ తార‌లంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మైయారు.  ప‌లువురు ప‌లు ర‌కాలుగా స‌మ‌యాన్ని వెల్ల‌దీస్తున్నారు.

షాకింగ్.. చైనాలో మరో ప్రాణాంతక వైరస్..!

చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచం నలువైపులా విసర్తిరించడంతో ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాలు దాటేసిన ఈ వైరస్ ఎప్పుడు ఎవర్ని సోకుతుందో..?

కరోనాపై ఆందోళన వద్దు.. పారాసిట్‌మాల్‌ వేసుకోండి!

కరోనాపై ఆందోళన వద్దని.. పారాసిటిమాల్ వేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్ ప్రకటించారు. కాగా ఇదివరకే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇదివరకే పారాసిటిమాల్, బ్లీచింగ్ పౌడర్

కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు నిర్మలమ్మ శుభవార్త!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి