చిరు మూవీ కోసం మహేశ్ పారితోషికం ఎంతంటే...!

  • IndiaGlitz, [Saturday,February 29 2020]

మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సుమారు 40 శాతం షూటింగ్ కూడా ముగిసింది. అయితే ఈ సినిమాలో యంగ్ మెగాస్టార్‌గా అంటే ఫ్లాష్ బ్యాక్‌లో మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత బన్నీ నటిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ పుకార్లే అని తేలిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆ పాత్రలో నటిస్తున్నారని గట్టిగానే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒప్పందం కుదర్చుకుని అధికారిక ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో మహేశ్ పాత్ర ఎలా ఉంటుంది..? మెగాస్టార్, సూపర్‌స్టార్ కలిసి నటిస్తే పరిస్థితి ఏంటి..? నిజంగానే ఆయన నటిస్తున్నారా..? అనేది ఇప్పుడు ఇటు సోషల్ మీడియాలో అటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే తాజాగా.. ఇందుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది. 30 నిమిషాల నిడివి కలిగిన పాత్రలో మహేశ్ నటించనున్నాడని సమాచారం. అరగంటకు గాను 30 కోట్ల రూపాయిలు ఇచ్చుకోవాలని దర్శకనిర్మాతలకు మహేశ్ తేల్చిచెప్పేశారట. అంతేకాదు లాభాల్లో వాటా కూడా అడిగారట. వాస్తవానికి ఇలాంటి పాత్రల్లో నటించడానికి మహేశ్ ఆసక్తి చూపడు అయితే.. మెగాస్టార్ సరసన కాబట్టి నోటి మాటెత్తకుండా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతేకాదు.. మహేశ్ కోసం ప్రత్యేకంగా హీరోయిన్‌ కూడా సెట్ చేసేశారట. ఆ బ్యూటీ మరెవరో కాదు.. పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్దేనట.

మహేశ్ పాత్ర, రెమ్యునరేషన్, హీరోయిన్ గురించి వస్తున్న వార్తలను చూసిన నెటిజన్లు.. ‘వామ్మో సూపర్ స్టార్ సరిలేరు మీకెవ్వరు’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కాంబో కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తున్నామని అభిమానులు చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాలెంత..? ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయా..? లేదా అక్షరాలా నిజమవుతాయా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.

More News

చిరు జోలికొస్తే చూస్తూ ఊరుకోం.. తోలు తీస్తాం!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటిని ముట్టడించాలని అమరావతి జేఏసీ నాయకులు అనుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తాము ఈ ప్రకటన చేయలేదని జేఏసీ చెప్పినప్పటికీ క్లారిటీ రాలేదు.

విజయశాంతిపై అనీల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ పోస్ట్!

ఒకట్రెండు కాదు ఏకంగా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి అలియాస్ రాములమ్మ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా వరుస విజయాల దర్శకుడు

శ్రీవిష్ణు చిత్రం 'రాజ రాజ చోర'

ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

నాని సినిమా కోసం ఆస్కార్ సంగీత ద‌ర్శ‌కుడు

నేచుర‌ల్ స్టార్ నాని వ‌రు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే త‌న 25వ సినిమా `వి`ను పూర్తి చేశాడో లేదో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా త‌న 26వ సినిమాకు రెడీ అయిపోయాడు.

మ‌రో సినిమాను ట్రాక్‌లో పెడుతున్న ర‌వితేజ‌

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఇప్పుడు కొత్త సినిమాల‌కు ఓకే చెబుతున్నాడు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన డైరెక్ష‌న్‌లో ర‌వితేజ సినిమా చేయబోతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.