విజయశాంతే ఆ పాత్రకు కరెక్ట్.. నాన్నగారు సర్‌ప్రైజ్!

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం ఎల్లుండి అనగా.. జనవరి 11న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ప్రమోషన్‌లో భాగంగా సరిలేరు ఇంటర్వ్యూలో గురించి పలు ఆసక్తికర విషయాలను మహేశ్ వెల్లడించారు. ఈ క్రమంలో లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ గురించి ప్రస్తావన రాగా.. తన మనసులోని మాటను మహేశ్ బయటపెట్టారు.

ప్రశ్న : చాలాకాలం తర్వాత విజయశాంతితో మళ్లీ వర్క్‌ చేయడం ఎలా అన్పించింది?

మహేశ్ : అమేజింగ్‌ ఫీలింగ్‌. ఆమెతో ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమా చేశాను. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫ్లైట్‌లో కలిశాం తప్ప టచ్‌లో లేను. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఫస్ట్‌డే షూటింగ్‌ జరుగుతున్నప్పుడు చాలాకాలం తర్వాత మళ్లీ చేస్తున్నాను అనే ఫీల్‌ ఉంది. కానీ ఒక షాట్‌ చేయగానే ‘కొడుకు దిద్దిన కాపురం’ షూటింగ్‌ నిన్ననే జరిగినట్లు అనిపించింది. ఆవిడ తప్ప ఈ క్యారెక్టర్‌ని అంత బాగా ఎవరూ చేయలేరు. ఆమె ఈ క్యారెక్టర్‌ చేయడం ఈ సినిమాకి, మా టీమ్‌కి పెద్ద అడ్వాంటేజ్‌ అయ్యింది. ఆమెకి ఈ సందర్భంగా థాంక్స్‌ తెలియజేస్తున్నాను’ అని మహేశ్ చెప్పుకొచ్చారు.

ప్రశ్న: ఈ సినిమాలో కృష్ణగారు కనిపిస్తారు అని దర్శకుడు అనిల్‌ చెప్పారు?

మహేశ్ : అది సినిమాలో ఒక సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌. మా అందరికి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది అని మహేశ్ ఈ ఇంటర్వ్యూ వేదికగా తన మనసులోని మాటలను బయటపెట్టారు.

More News

మహేశ్ ఇంటి ముందు ధర్నానా..? ‘సరిలేరు’ ప్రమోషన్ స్టంటా!?

అమరావతి తరలింపు వ్యవహారంపై నవ్యాంధ్ర రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున రైతులు, రైతు కూలీలు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఎస్.. అనిల్‌తో మళ్లీ సినిమా చేస్తా..: మహేశ్

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

'విట్టల్ వాడి' రిలీజ్‌ డేట్‌

ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోహిత్,సుధా రావత్,నటీనటులుగా నాగేందర్.టి.దర్శకత్వంలో జి.నరేష్ రెడ్డి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా నిర్మిస్తున్న  చిత్రం "విట్ఠల్ వాడి"

నెక్స్ట్ సినిమా ఆయనతోనే.. క్లారిటీ ఇచ్చేసిన మహేశ్

‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో

'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్‌పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.. బొమ్మ దద్దరిల్లిపోద్ది - సూపర్‌స్టార్‌ మహేష్‌

'భరత్‌ అనే నేను', 'మహర్షి'లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌ హీరోగా దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో