ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ చెప్పిన మహేశ్!

  • IndiaGlitz, [Sunday,September 15 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ వీరాభిమానులు, సినీ ప్రియులు షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘకాలంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ‘అనేకమంది డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. కానీ ఓ ప్రాచీన వైద్యవిధానంతో నన్ను వేధిస్తున్న బాధ నుంచి విముక్తుడిని అయ్యాను. మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్న కాలంలో నా అర్ధాంగి నమ్రత ఓ స్నేహితురాలి ద్వారా డాక్టర్ సత్య సింధూజను కలిసింది. సింధూజ చక్రసిద్ధ నాడీ వైద్యంలో నిపుణురాలు. ఆమె అందించిన చికిత్సతో మైగ్రేన్ తలనొప్పి మటుమాయం అయింది. నాలా మైగ్రేన్‌తో బాధపడుతున్న వాళ్ల కోసమే ఈ విషయం వెల్లడిస్తున్నాను’ అని ఒకింత భావోద్వేగతంతో మహేశ్ చెప్పుకొచ్చారు.

నాకు బాధ్యత ఉంది!
అయితే ఇలాంటి వ్యాధి నుంచి బయటపడాలంటే ‘చక్రసిద్ధ నాడీ’ వైద్యం ఒక్కటే మార్గమని.. తాను కూడా ఇలానే ఉపశమనం పొందాను కాబట్టి నమ్మకం ఏర్పడిందన్నారు. తనకు సంబంధించిన ఎలాంటి విషయాలనైనా సరే అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉన్నాని.. అయితే ఈ విషయాన్ని మాత్రం చాలా గోప్యం ఉంచినట్లు సూపర్‌స్టార్ తెలిపారు. అయితే తన మాదిరే ఈ సమస్య చాలామందికి ఉంటుందని, వాళ్లందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత తనకుందన్నారు.

More News

దూరం.. దూరం.. జగన్‌లాగే ‘డీకే’ కొత్త పార్టీ!?

కర్ణాటక నాట మరో కొత్త పార్టీ పుడుతోందా..? ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్ కొత్త పార్టీ పెట్టబోతున్నారా..?

మ‌రోసారి పాయ‌ల్‌తో స్పెష‌ల్‌..?

`RX 100` చిత్రంతో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టి హాట్ బ్యూటీగానే కాదు.. మంచి పెర్ఫామ‌ర్‌గా పేరు సంపాదించుకుంది పాయ‌ల్ రాజ్‌పుత్ దాంతో వెంకీమామ‌లో వెంక‌టేశ్ స‌ర‌స‌న‌,

మ‌రో రంగంలోకి ర‌కుల్‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ర‌కుల్ సినిమా రంగంతో పాటు ఫిట్‌నెస్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యేల ఎటాక్.. 100 సెకన్లు కూడా!

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివేదికను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌ హీరోలంతా ఒకే వేదికపై కలిసిన వేళ..!

టాలీవుడ్ హీరోలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రిరిలీజ్ ఈవెంట్స్‌, సినిమా థియేటర్లలో, జిమ్‌లలో, విదేశీ యాత్రల్లో కలుస్తుంటారు.